బాధిత కుటుంబానికి రూ.5,016 ఆర్థిక సహాయం
విశ్వంభర, గుండాల : గుండాల మండలం కొమ్మాయిపల్లి గ్రామానికి చెందిన ఏలూరి బలరాం ఇటీవల ఆకస్మికంగా మృతి చెందడంతో వారి కుటుంబాన్ని ఫౌండేషన్ చైర్మన్ మబ్బు మహేష్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం కుటుంబానికి రూ.5,016 ఆర్థిక సహాయాన్ని అందజేసి, ఈ క్లిష్ట సమయంలో తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మబ్బు మహేష్ మాట్లాడుతూ, "మానవ సేవే మాధవసేవ" అనే మహోన్నత లక్ష్యంతో మబ్బు అబ్బాస్ ఫౌండేషన్ మండల వ్యాప్తంగా ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాండ్ర నారాయణ స్వామి, తాండ్ర యాదగిరి, తాండ్ర రాజు, ఫౌండేషన్ సభ్యులు మలిపెద్ది విక్రమ్ రెడ్డి, మల్లెపాక పరశురాములు, గొల్లపల్లి సురేష్, అల్వాల రాజు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి రూ.5,016 ఆర్థిక సహాయం
విశ్వంభర, గుండాల : గుండాల మండలం కొమ్మాయిపల్లి గ్రామానికి చెందిన ఏలూరి బలరాం ఇటీవల ఆకస్మికంగా మృతి చెందడంతో వారి కుటుంబాన్ని ఫౌండేషన్ చైర్మన్ మబ్బు మహేష్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం కుటుంబానికి రూ.5,016 ఆర్థిక సహాయాన్ని అందజేసి, ఈ క్లిష్ట సమయంలో తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మబ్బు మహేష్ మాట్లాడుతూ, "మానవ సేవే మాధవసేవ" అనే మహోన్నత లక్ష్యంతో మబ్బు అబ్బాస్ ఫౌండేషన్ మండల వ్యాప్తంగా ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాండ్ర నారాయణ స్వామి, తాండ్ర యాదగిరి, తాండ్ర రాజు, ఫౌండేషన్ సభ్యులు మలిపెద్ది విక్రమ్ రెడ్డి, మల్లెపాక పరశురాములు, గొల్లపల్లి సురేష్, అల్వాల రాజు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


