జీలుగు విత్తనాల పంపిణీ ప్రారంభం
విశ్వంభర, హుస్నాబాద్ : హుస్నాబాద్ నియోజకవర్గం సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి సహకార సంఘం ఆధ్వర్యంలో జీలుగు విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని సంఘం చైర్పర్సన్ ఇంచార్జి బిల్ల వెంకట్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించి అధిక దిగుబడులు సాధించే దిశగా సహకార సంఘం కృషి చేస్తోందన్నారు. రైతులు శాస్త్రీయ విధానాలతో సాగు చేపట్టి ప్రభుత్వ సూచనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వెన్నంపల్లి సర్పంచ్ మోలుగురి చిరంజీవి, డైరెక్టర్లు సారాబుడ్ల రాజిరెడ్డి, గుండేటి శ్రీనివాస్, సిహెచ్ రాజేశ్వర్రెడ్డి, మోలుగురి సంపతి, కౌడగాని మోహన్రావు, దొనపాటి రామ్రెడ్డి, ఆరేపల్లి ఉప సర్పంచ్ వెంగళ రవి, వర్నె మోహన్రావు, రైతులు నరసయ్య తదితరులు పాల్గొన్నారు.
జీలుగు విత్తనాల పంపిణీ ప్రారంభం
విశ్వంభర, హుస్నాబాద్ : హుస్నాబాద్ నియోజకవర్గం సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి సహకార సంఘం ఆధ్వర్యంలో జీలుగు విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని సంఘం చైర్పర్సన్ ఇంచార్జి బిల్ల వెంకట్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించి అధిక దిగుబడులు సాధించే దిశగా సహకార సంఘం కృషి చేస్తోందన్నారు. రైతులు శాస్త్రీయ విధానాలతో సాగు చేపట్టి ప్రభుత్వ సూచనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వెన్నంపల్లి సర్పంచ్ మోలుగురి చిరంజీవి, డైరెక్టర్లు సారాబుడ్ల రాజిరెడ్డి, గుండేటి శ్రీనివాస్, సిహెచ్ రాజేశ్వర్రెడ్డి, మోలుగురి సంపతి, కౌడగాని మోహన్రావు, దొనపాటి రామ్రెడ్డి, ఆరేపల్లి ఉప సర్పంచ్ వెంగళ రవి, వర్నె మోహన్రావు, రైతులు నరసయ్య తదితరులు పాల్గొన్నారు.


