చైతన్యపురి డివిజన్ కాంగ్రెస్ నాయకులు బిఆర్ఎస్ పార్టీలో చేరికలు

చైతన్యపురి డివిజన్ కాంగ్రెస్ నాయకులు బిఆర్ఎస్ పార్టీలో చేరికలు

విశ్వంభర, చైతన్యపురి ;- ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సమక్షములో  కాంగ్రెస్ సీనియర్ నాయకులు బిఆర్ఎస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. చైతన్యపురి డివిజన్ కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, ప్రభాకర్, తిరుమల్ రెడ్డి లకు ఎమ్మెల్యే సాదరంగా ఆహ్వానించి బి ఆర్ ఎస్ కండువాలు కప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు తోట మహేష్ యాదవ్, నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, త్రివేది, పవన్, గట్టు శ్రీను, రమణ రెడ్డి, వీరన్నయాదవ్, ప్రవీణ్ చారీ తదితరులు పాల్గొనడం జరిగింది.

Tags: