గుండెపోటుతో బాసాని లక్ష్మణ్ మృతి - నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
On
నార్కెట్పల్లి ,విశ్వంభర :-నకిరేకల్ నియోజకవర్గం నార్కట్ పల్లి మండలంలోని అమ్మనబోలు గ్రామానికి చెందిన బాసాని లక్ష్మణ్ గుండె పోటుతో హఠాత్మరణం చెందడం జరిగింది.మరణ వార్త విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అమ్మనబోలు గ్రామానికి చేరుకొని మృత దేహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.కుటుంభ సభ్యులను ఓదారుస్తూ ధైర్యంగా ఉండాలని, అండగా ఉంటానని పరామర్శించడం జరిగింది.మాజీ ఎమ్మెల్యే వెంట స్థానిక బి ఆర్ ఎస్ నాయకులు , కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.