అడ్డగుట్ట పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
విద్యార్థులకు నోట్ పుస్తకాలను పంపిణీ చేసిన కళ్లేపల్లి రాజు నేత .
On
విశ్వంభర, హైదరాబాద్ :- 142వ డివిజన్ అడ్డగుట్ట పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి కళ్లేపల్లి రాజు నేత ముఖ్యఅతిథిగా పాల్గొని జండా ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా విద్యార్థులకు నోట్ పుస్తకాలను పంపిణీ చేయడం జరిగింది. సంఘం అధ్యక్షులు పెండెం మనోహర్ , ప్రధాన కార్యదర్శి ఆడెపు శ్రీరాములు, బొడ్డు సంతోష్, చిలువేరి రామకృష్ణ మరియు కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించబడింది



