కాంగ్రెస్ వీరాభిమాని.. చెప్పులు లేకుండా 3000 కిలోమీటర్లు పాదయాత్ర

కాంగ్రెస్ వీరాభిమాని.. చెప్పులు లేకుండా 3000 కిలోమీటర్లు పాదయాత్ర

తాను సాదాసీదా రైతునని, కాంగ్రెస్ పార్టీకి వీరాభిమానినని చెప్పుకొచ్చాడు. ఇంత శ్రమ పడటం ఎందుకు అని జగ్గారెడ్డి అడగగా.. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే వరకు ఇలాగే ఆయన వెంట తిరగాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

ఒంటి నిండా కాంగ్రెస్ కండువాలు.. చేతిలో కాంగ్రెస్ జెండా.. కాళ్లకు కనీసం చెప్పులు లేవు.. సుమారు 3వేల కిలోమీటర్లు చెప్పులు లేకుండా పాదయాత్ర చేస్తున్నాడు. అతడే సదాశివాలేఖర్. ఆయన కాంగ్రెస్ పార్టీకి వీరాభిమాని. అయితే, సదాశివాలేఖర్ ఏఐసీసీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేత జగ్గారెడ్డికి ఎదురుపడ్డాడు. ఆ వ్యక్తిని జగ్గారెడ్డి ఆరాతీయగా తన స్వస్థలం మహారాష్ట్రలోని షిర్డీ అని తెలిపాడు. తాను మణిపూర్ నుంచి బాంబే వరకు రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొన్నానని తెలిపాడు. అది విన్న జగ్గారెడ్డి ఆశ్చర్యానికి లోనయ్యారు. 

పూర్తి వివరాలు అడగగా తాను సాదాసీదా రైతునని, కాంగ్రెస్ పార్టీకి వీరాభిమానినని చెప్పుకొచ్చాడు. ఇంత శ్రమ పడటం ఎందుకు అని జగ్గారెడ్డి అడగగా.. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే వరకు ఇలాగే ఆయన వెంట తిరగాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే వ్యవసాయానికి మేలు జరుగుతుందని, రైతులకు మంచి రోజులు వస్తాయని సదాశివాలేఖర్ తెలిపాడు. రైతులకు ఇప్పటి వరకు మేలు చేసింది కాంగ్రెస్సేనని, రాహుల్ గాంధీ ప్రధాని అయితే రైతులతో పాటు అన్ని వర్గాలకు అండగా ఉంటారని జగ్గారెడ్డితో అన్నాడు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి ఆయనను అభినందించారు.

Read More ఆర్చరీలో సముద్రాల అఖిల్‌కు స్వర్ణం

Advertisement

LatestNews

జూన్ 2 నాటికి జ‌ర్న‌లిస్ట్‌ల ఇళ్ల స్ధ‌లాల స‌మస్యకు ప‌రిష్కారం : మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి
కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది : టీజీఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి
డాక్టర్ చిలుకు స్వామికి శ్రమశక్తి అవార్డు..
సంగారెడ్డి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల అభివృద్ధికి మరోసారి ముందుకు వచ్చిన అరబిందో ఫార్మా
శ్రీ విద్యా వికాస్ హై స్కూల్ నూటికి నూరు శాతం ఫలితాలు
కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో పదవ తరగతి విద్యార్థుల ప్రతిభ 
ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలం: ఎమ్మెల్సీ కోటిరెడ్డి.