BREAKING: ఎమ్మెల్సీ కవితకు షాక్.. మరోసారి రిమాండ్ పొడిగింపు..!

BREAKING: ఎమ్మెల్సీ కవితకు షాక్.. మరోసారి రిమాండ్ పొడిగింపు..!

కవిత కస్టడీని మరో 14 రోజులు పొడిగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసు కవిత జ్యుడీషియల్ రిమాండ్ నేటి(సోమవారం)తో ముగియడంతో అధికారులు వర్చువల్‌గా రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురైంది. కవిత కస్టడీని మరో 14 రోజులు పొడిగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసు కవిత జ్యుడీషియల్ రిమాండ్ నేటి(సోమవారం)తో ముగియడంతో అధికారులు వర్చువల్‌గా రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు కవితకు జూన్ 3వ తేదీ వరకు జుడీషియల్ రిమాండ్‌ను పొడిగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 

ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్‌ కేసులో మార్చి 26న అరెస్టయ్యారు. అప్పటి నుంచి కస్టడీలో ఉన్న ఆమెకు బెయిల్ ఇప్పించడానికి ఆమె తరఫు న్యాయవాదులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ కవితకు ఊరట లభించడంలేదు. సీబీఐ, ఈడీ నమోదు చేసిన రెండు కేసులు ఇప్పట్లో కవితను వీడేలా కనిపించడంలేదు. 

Read More ఘనంగా మున్నూరు కాపు మహిళ సంఘం బతుకమ్మ వేడుకలు

లిక్కర్ స్కామ్‌లో కవిత కింగ్ పిన్‌గా ఈడీ వాదనలు వినిపిస్తోంది. కవిత నేతృత్వంలో సౌత్ గ్రూప్‌ నుంచి రూ.100కోట్లు ఆప్ కీలక నేతలకు చేరాయని ఆరోపించింది. ఈ సమాచారం రాబట్టేందుకు కస్టడీని పొడిగించాలని ఈడీ కోర్టును కోరింది. తాజాగా కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించారు.