ఆగస్ట్ 7న చేనేత కళాకారులకు సన్మానం - బొమ్మ రఘురామ్ నేత ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు

ప్రజా విశ్వంభర, ఎల్ బీ నగర్ : 11వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బన్ చేనేత కన్వీనర్, రంగారెడ్డి జిల్లా పద్మశాలి అధ్యక్షులు బొమ్మ రఘురామ్ నేత ఆధ్వర్యములో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలను ఆగస్ట్ 7 వ తేదీన ఆటో నగర్ లోని కర్నాటి గార్డెన్స్ లో నిర్వహించనున్నట్లు మీడియా సమావేశంలో వారు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చేనేత దినోత్సవం సందర్బంగా చేనేత కళాకారులు, జాతీయ చేనేత అవార్డు గ్రహీతలకు  సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎన్ రామ్ చందర్ రావు, మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ హాజరు కానున్నట్లు తెలిపారు. ప్రతి చేనేత కార్మిక సంఘాలు, కళాకారులు, పద్మశాలి సంఘాలు, యువజన సంఘాలు పాల్గొని చేనేత దినోత్సవాన్ని విజయవంతం చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత పద్మశాలి ఉపాధ్యక్షులు పెద్ది జగదీష్ నేత, పులగం రాములు నేత, వేముల రాము నేత, పొట్టబత్ని జ్ఞానేశ్వర్, చేరిపల్లి ప్రభాకర్ నేత, జెల్ల నరేందర్ నేత, బొమ్మ దశరద నేత, శివ నేత తదితరులు పాల్గొన్నారు.

Tags: