చంద్రబాబు ఇంటికి బోయపాటి శ్రీను

చంద్రబాబు ఇంటికి బోయపాటి శ్రీను

ఏపీలో టీడీపీ శ్రేణుల కోలాహాలం మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంబురాల్లో మునిగిపోయారు.

విశ్వంభర, హైదరాబాద్ : ఏపీలో టీడీపీ శ్రేణుల కోలాహాలం మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంబురాల్లో మునిగిపోయారు. ఈ క్రమంలో వైఎస్ఆర్ సీపీ పార్టీ గుర్తు అయిన ఫ్యాన్‌‌ను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఇళ్లలో ఉన్న ఫ్యాన్లను రోడ్డుపైకి తీసుకోచ్చి విరగ్గొడుతున్నారు. మరోవైపు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ఇంటి వద్ద కోలాహలం ప్రారంభమైంది. రాజకీయ ప్రముఖులతోపాటు పార్టీ ముఖ్య నాయకులు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. సినీ దర్శకుడు బోయపాటి శ్రీను చంద్రబాబు ఇంటికి వెళ్లారు. ఇంకో వైపు జనసేన సైనికులు ఎర్ర కండువాలతో హల్ చల్ చేశారు. విజయవాడ, హైదరాబాద్‌తోపాటు ఏపీ వ్యాప్తంగా సంబురాల్లో మునిగిపోయారు. 

Related Posts