ఖాతాదారుల సహకారంతో పురోభివృద్ది లో సుధా బ్యాంక్
విశ్వంభర, సూర్యాపేట: వాటాదారుల ఖాతాదారుల సహకారంతో పురోభివృద్ధిలో సుధా బ్యాంక్ పయనిస్తుందని బ్యాంక్ చైర్మన్ మీలా మహదేవ్, మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గణేష్ చెప్పారు. స్థానిక త్రివేణి ఫంక్షన్ హాల్ లో జరిగిన 27వ వార్షిక సర్వసభ్య సమావేశంలో వారు మాట్లాడుతూ ,సహకార రంగంలో 27 సంవత్సరాలుగా అద్భుతమైన ఫలితాలు సాధిస్తూ క్రమం తప్పకుండా వాటాదారులకు డివిడెంట్ పంపిణీ చేస్తూ పురోభివృద్ధిలో బ్యాంకు పయనిస్తుందని చెప్పారు. బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గణేష్ ఎజెండా తీర్మానాలను చదివి వినిపించి వాటాదారుల ఆమోదం పొందారు. రాబోయే సంవత్సర కాలానికి బ్యాంకు సొంత భవనం ఏర్పాటు చేయాలని తీర్మానానికి వాటాదారులందరూ హర్ష ఆమోదాలతెలిపారు. 9 బ్రాంచీలతో బ్యాంకు పటిష్టంగా ఉందని రాబోయే కాలంలో మరిన్ని శాఖలు ఏర్పాటు చేస్తామని మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గణేష్ తెలియజేశారు. మొదట చైర్మన్ నివేదికను వైస్ చైర్మన్ కక్కిరేణి శేఖర్ చదివి వినిపించారు. బ్యాంకు పనితీరును సమీక్షిస్తూ పుర ప్రముఖులు వాటాదారులు గండూరి శంకర్ ,పెద్దిరెడ్డి రాజా ఇరికి కోటేశ్వరి ప్రసంగించారు .ఈ కార్యక్రమంలో బ్యాంకు డైరెక్టర్లు ఏపూరి శ్రవణ్ కుమార్ , మీలా సందీప్, తోట శ్యాంప్రసాద్ ,డాక్టర్ విజయలక్ష్మి ,అనంతల శారద, బానోతు సుజాత, పటేల్ నరసింహారెడ్డి ,బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ సభ్యులు భువనగిరి భాస్కర్, ఇరుకుల్ల చెన్నకేశవరావు వెంపటి రమణ ,శ్రీమతి పొనుగోటి నిర్మల తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పోటాదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఖాతాదారుల సహకారంతో పురోభివృద్ది లో సుధా బ్యాంక్
విశ్వంభర, సూర్యాపేట: వాటాదారుల ఖాతాదారుల సహకారంతో పురోభివృద్ధిలో సుధా బ్యాంక్ పయనిస్తుందని బ్యాంక్ చైర్మన్ మీలా మహదేవ్, మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గణేష్ చెప్పారు. స్థానిక త్రివేణి ఫంక్షన్ హాల్ లో జరిగిన 27వ వార్షిక సర్వసభ్య సమావేశంలో వారు మాట్లాడుతూ ,సహకార రంగంలో 27 సంవత్సరాలుగా అద్భుతమైన ఫలితాలు సాధిస్తూ క్రమం తప్పకుండా వాటాదారులకు డివిడెంట్ పంపిణీ చేస్తూ పురోభివృద్ధిలో బ్యాంకు పయనిస్తుందని చెప్పారు. బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గణేష్ ఎజెండా తీర్మానాలను చదివి వినిపించి వాటాదారుల ఆమోదం పొందారు. రాబోయే సంవత్సర కాలానికి బ్యాంకు సొంత భవనం ఏర్పాటు చేయాలని తీర్మానానికి వాటాదారులందరూ హర్ష ఆమోదాలతెలిపారు. 9 బ్రాంచీలతో బ్యాంకు పటిష్టంగా ఉందని రాబోయే కాలంలో మరిన్ని శాఖలు ఏర్పాటు చేస్తామని మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గణేష్ తెలియజేశారు. మొదట చైర్మన్ నివేదికను వైస్ చైర్మన్ కక్కిరేణి శేఖర్ చదివి వినిపించారు. బ్యాంకు పనితీరును సమీక్షిస్తూ పుర ప్రముఖులు వాటాదారులు గండూరి శంకర్ ,పెద్దిరెడ్డి రాజా ఇరికి కోటేశ్వరి ప్రసంగించారు .ఈ కార్యక్రమంలో బ్యాంకు డైరెక్టర్లు ఏపూరి శ్రవణ్ కుమార్ , మీలా సందీప్, తోట శ్యాంప్రసాద్ ,డాక్టర్ విజయలక్ష్మి ,అనంతల శారద, బానోతు సుజాత, పటేల్ నరసింహారెడ్డి ,బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ సభ్యులు భువనగిరి భాస్కర్, ఇరుకుల్ల చెన్నకేశవరావు వెంపటి రమణ ,శ్రీమతి పొనుగోటి నిర్మల తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పోటాదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.


