వల్లపు రెడ్డి రాజిరెడ్డి మృతి . - సంతాపం తెలిపిన టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్
విశ్వంభర,మహబూబాబాద్ జిల్లా : టీఎన్జీవోస్ నేత వల్లపు రెడ్డి రాజిరెడ్డి అనారోగ్యంతో మృతి చెందడంతో పలువురు సంతాపం తెలిపారు .ఈ సందర్భంగా టి ఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ వల్లపు రెడ్డి రాజిరెడ్డి అనే వ్యక్తి చాలా సంవత్సరాల కాలంగా రెవెన్యూ శాఖలో మహబూబాబాద్ ప్రాంతంలో సుదీర్ఘకాలంగా పనిచేశారని , ఎవరితో ఎలాంటి మాట పడకుండా మంచి పేరు తెచ్చుకున్నారని , వల్లపు రెడ్డి రాజిరెడ్డి మృతి బాధాకరం , ఆయన మంచి మృదు స్వభావి గల వ్యక్తి అని , అందరికీ సుపరిచితుడని , ఈయన మృతి అందరికీ చాలా బాధాకరమని, అంతేకాకుండా ఈయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హనుమకొండలోని తన నివాసంలో మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారని ఆయన అన్నారు . సంతాపం తెలిపిన వారిలో తెలంగాణ మున్సిపల్ సెంట్రల్ ఫోరం మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి సింగు రమేష్ , విశ్రాంత గ్రామ పంచాయతీల ఈవోల సంఘం నాయకులు చింతల రాజయ్య , మున్సిపల్ ఉద్యోగుల సంఘం నాయకులు రామంచ సుధాకర్, ఆకుల కిషోర్ కుమార్, మాధారపు కిరణ్ ,లు తదితరులు ఉన్నారు .
వల్లపు రెడ్డి రాజిరెడ్డి మృతి . - సంతాపం తెలిపిన టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్
విశ్వంభర,మహబూబాబాద్ జిల్లా : టీఎన్జీవోస్ నేత వల్లపు రెడ్డి రాజిరెడ్డి అనారోగ్యంతో మృతి చెందడంతో పలువురు సంతాపం తెలిపారు .ఈ సందర్భంగా టి ఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ వల్లపు రెడ్డి రాజిరెడ్డి అనే వ్యక్తి చాలా సంవత్సరాల కాలంగా రెవెన్యూ శాఖలో మహబూబాబాద్ ప్రాంతంలో సుదీర్ఘకాలంగా పనిచేశారని , ఎవరితో ఎలాంటి మాట పడకుండా మంచి పేరు తెచ్చుకున్నారని , వల్లపు రెడ్డి రాజిరెడ్డి మృతి బాధాకరం , ఆయన మంచి మృదు స్వభావి గల వ్యక్తి అని , అందరికీ సుపరిచితుడని , ఈయన మృతి అందరికీ చాలా బాధాకరమని, అంతేకాకుండా ఈయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హనుమకొండలోని తన నివాసంలో మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారని ఆయన అన్నారు . సంతాపం తెలిపిన వారిలో తెలంగాణ మున్సిపల్ సెంట్రల్ ఫోరం మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి సింగు రమేష్ , విశ్రాంత గ్రామ పంచాయతీల ఈవోల సంఘం నాయకులు చింతల రాజయ్య , మున్సిపల్ ఉద్యోగుల సంఘం నాయకులు రామంచ సుధాకర్, ఆకుల కిషోర్ కుమార్, మాధారపు కిరణ్ ,లు తదితరులు ఉన్నారు .


