విప్లవ, కళా యోధుల ఆశయాలు సాధిద్దాం. - సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పిలుపు .
On
విశ్వంభర, మహబూబాబాద్ జిల్లా : భారత విప్లవోద్యమంలో తమ వంతు పాత్ర నిర్వహిస్తూ అగ్ర నాయకులు ఎదిగిన రాయల చంద్రశేఖర్, విప్లవ గాయకుడు పరకాల నాగన్న ఆశయాలను సాధిద్దామని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి , అరుణోదయ సాంస్కృత సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఈర్ల వెంకన్నలు అన్నారు . రాయల చంద్రశేఖర్ రెండవ వర్ధంతి, పరకాల నాగన్న సంస్మరణ సభ నీ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించారు . ఈ సంస్మరణ సభకి పార్టీ మహబూబాబాద్ డివిజన్ అధ్యక్షులు ఈక బిక్షం అధ్యక్షతన వహించారు . అనంతరం అమరులకు నిమిషాలపాటు మౌనం పాటించి కార్యక్రమం ప్రారంభించారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన రవి మాట్లాడుతూ నక్సల్ బరి విప్లవ ప్రభావంతో విప్లవోద్యమంలో పనిచేస్తూ ఎందరో వీరులు నేల కోరిగారని చంద్రశేఖర్,నాగన్న ఓకే ఉద్యమంలో జీవితాలను త్యాగం చేసిన గొప్ప నాయకులని కొనియాడారు . ఓకే మండలానికి చెందిన వీరిరువురు చిన్నతనంలో నుండి నిర్బంధాన్ని కేసులను ఎదుర్కొన్నారని అన్నారు . భారత దేశంలో మోడీ సర్కార్ , దేశ , సర్వసంపదలు , కష్టజీవులకు దక్కకుండా కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్తున్న నేటి తరుణంలో అపార అనుభవం ఉన్న చంద్రశేఖర్,నాగన్న మృతి తీరని లోటు అని వారు అన్నారు . వ్యవసాయ పారిశ్రామిక రంగాలను నిర్వీర్యం చేస్తూ అదాని , అంబానీ లాంటి బడా బాబులకు సంపదను పెంచుతున్న బిజెపి-ఆర్ఎస్ఎస్ విధానాలను తిప్పి కొట్టటమే అమరులకు నిజమైన నివాళి అని అన్నారు . రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలు ఆరు గ్యారంటీలు అమలులో పూర్తిగా విఫలమైనారని అన్నారు . కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై వర్గ పోరాటాలను తీవ్రతరం చేసి నూతన ప్రజాస్వామ్య విప్లవాన్ని విజయవంతం చేయటమే మాస్ లైన్ పార్టీ కర్తవ్యం అని అన్నారు . ఇంకా పలువురు కార్యక్రమం నీ ఉద్దేశించి మాట్లాడారు . ఈ సంస్మరణ సభలో సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ డివిజన్ నాయకులు బూర్గుల మోష, పి వై ఎల్ మాజీ జిల్లా కార్యదర్శి ఇరుగు అనిల్, పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు బానోతు నందీశ్వర్ తోపాటు నాగేశ్వరరావు , వీరస్వామి , సూరన్న , పరశురాములు , సురేష్ వెంకన్న , రంగయ్య , రాములు తదితరులు పాల్గొన్నారు .
🕒 15 Jul 2026 ✍️ Desk
విప్లవ, కళా యోధుల ఆశయాలు సాధిద్దాం. - సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పిలుపు .
విశ్వంభర, మహబూబాబాద్ జిల్లా : భారత విప్లవోద్యమంలో తమ వంతు పాత్ర నిర్వహిస్తూ అగ్ర నాయకులు ఎదిగిన రాయల చంద్రశేఖర్, విప్లవ గాయకుడు పరకాల నాగన్న ఆశయాలను సాధిద్దామని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి , అరుణోదయ సాంస్కృత సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఈర్ల వెంకన్నలు అన్నారు . రాయల చంద్రశేఖర్ రెండవ వర్ధంతి, పరకాల నాగన్న సంస్మరణ సభ నీ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించారు . ఈ సంస్మరణ సభకి పార్టీ మహబూబాబాద్ డివిజన్ అధ్యక్షులు ఈక బిక్షం అధ్యక్షతన వహించారు . అనంతరం అమరులకు నిమిషాలపాటు మౌనం పాటించి కార్యక్రమం ప్రారంభించారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన రవి మాట్లాడుతూ నక్సల్ బరి విప్లవ ప్రభావంతో విప్లవోద్యమంలో పనిచేస్తూ ఎందరో వీరులు నేల కోరిగారని చంద్రశేఖర్,నాగన్న ఓకే ఉద్యమంలో జీవితాలను త్యాగం చేసిన గొప్ప నాయకులని కొనియాడారు . ఓకే మండలానికి చెందిన వీరిరువురు చిన్నతనంలో నుండి నిర్బంధాన్ని కేసులను ఎదుర్కొన్నారని అన్నారు . భారత దేశంలో మోడీ సర్కార్ , దేశ , సర్వసంపదలు , కష్టజీవులకు దక్కకుండా కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్తున్న నేటి తరుణంలో అపార అనుభవం ఉన్న చంద్రశేఖర్,నాగన్న మృతి తీరని లోటు అని వారు అన్నారు . వ్యవసాయ పారిశ్రామిక రంగాలను నిర్వీర్యం చేస్తూ అదాని , అంబానీ లాంటి బడా బాబులకు సంపదను పెంచుతున్న బిజెపి-ఆర్ఎస్ఎస్ విధానాలను తిప్పి కొట్టటమే అమరులకు నిజమైన నివాళి అని అన్నారు . రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలు ఆరు గ్యారంటీలు అమలులో పూర్తిగా విఫలమైనారని అన్నారు . కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై వర్గ పోరాటాలను తీవ్రతరం చేసి నూతన ప్రజాస్వామ్య విప్లవాన్ని విజయవంతం చేయటమే మాస్ లైన్ పార్టీ కర్తవ్యం అని అన్నారు . ఇంకా పలువురు కార్యక్రమం నీ ఉద్దేశించి మాట్లాడారు . ఈ సంస్మరణ సభలో సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ డివిజన్ నాయకులు బూర్గుల మోష, పి వై ఎల్ మాజీ జిల్లా కార్యదర్శి ఇరుగు అనిల్, పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు బానోతు నందీశ్వర్ తోపాటు నాగేశ్వరరావు , వీరస్వామి , సూరన్న , పరశురాములు , సురేష్ వెంకన్న , రంగయ్య , రాములు తదితరులు పాల్గొన్నారు .
🔗 https://www.vishvambhara.com/telangana/lets-achieve-the-aspirations-of-revolutionary-art-warriors-cpi/article-18667


