అంబేద్కర్ కి ఘనంగా నివాళులు
On
విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండలం ఎన్ డి తండా గ్రామపంచాయతీలో సర్పంచ్ ఆంగోత్ అరుణ గోపాల్ నాయక్ పాలకవర్గంతో బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి 135 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, బాబాసాహెబ్ అంబేద్కర్ జన ప్రభంజనాన్ని జాగృతం చేసిన సామాజిక విప్లవకారుడని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సురేఖ సురేష్, గ్రామ కార్యదర్శి నవనీత, వార్డ్ మెంబర్స్, రాణి భాస్కర్, చందర్, హరిలాల్, ప్రియాంక వెంకటేష్, సామ్లి గోవిందు, అంజి, సాయి,గ్రామ శాఖ అధ్యక్షులు, ఇందిరమ్మ కమిటీ మెంబర్స్, గ్రామ పెద్దలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.



