రైతన్నల కోసం చలి వేంద్రాలను ఏర్పాటు చేసిన TR ఫౌండేషన్
విశ్వంభర, చండూర్ మండలం: మండలంలోని కస్తాల,చండూర్ మున్సిపాలిటీ(అంగడిపేట),గుండ్రపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో TR ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను కస్తాల గ్రామంలో కోడి సుష్మా-వెంకన్న (DCCB డైరెక్టర్,FSCS చైర్మన్)చేతుల మీదగా గుండ్రపల్లి గ్రామంలో మండల వ్యవసాయ అధికారి కుమారి చంద్రిక చేతుల ప్రారంభించడమైనది. బంగారిగడ్డ, పుల్లెంల,కొండాపురం ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల్లో చల్లని త్రాగు నీరుతో చలి వేంద్రాలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్బంగా DCCB డైరెక్టర్ కోడి సుష్మా వెంకన్న మాట్లాడుతూ మా FSCS కొనుగోలు కేంద్రాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసిన TR ఫౌండేషన్ చైర్మన్ బొబ్బల వెంకట్ రామ్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. భవిష్యత్తులో రైతు కుటుంబాల కోసం మరెన్నో కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. ఈ సందర్బంగా ఫౌండేషన్ చైర్మన్ బొబ్బల వెంకట్ రామ్ రెడ్డి (TOM REDDY)మాట్లాడుతూ నేను కూడా రైతు కుటుంబంలో జన్మించిన రైతు బిడ్డని.రైతులు పడే పడే బాధలను కళ్లారా చూసానని తెలిపారు. రైతులకు చల్లని త్రాగునీరు అందించడం చాలా అవసరం, ఎందుకంటే వేడి వాతావరణంలో వారు చాలా శ్రమపడతారు మరియు నీరు త్రాగడం వారి ఆరోగ్యానికి చాలా ముఖ్యం.చల్లని నీరు త్రాగడం వల్ల వారు వేడిగా ఉండకుండా మరియు శక్తిని కోల్పోకుండా ఉంటారరని అందుకోసమే మండలంలోని అన్ని ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల్లో చలి వేంద్రాలను ఏర్పాటు చేశామని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ సందర్బంగా మండల వ్యవసాయ అధికారి కుమారి చంద్రిక గారు మాట్లాడుతూ చండూర్ మండలంలోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో చలి వేంద్రాలను ఏర్పాటు చేసిన TR ఫౌండేషన్ వారికి ధన్యవాదములు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న FSCS వైస్ చైర్మన్ శ్రీనివాస్ , డైరెక్టర్ కట్ట బిక్షం ,కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సామ అమరేందర్ రెడ్డి , లక్ష్మీ , బూతరాజు ఫణి ,ఫౌండేషన్ సభ్యులు పిన్నింటి వెంకట్ రెడ్డి , పిన్నింటి నరేందర్ రెడ్డి , రాజు , రఘు , సైదులు , రవి , దిలీప్ , నర్సింహా రైతులు పాల్గొన్నారు.