థియేటర్‌లో ఏసీ లేదు.. యాజమాన్యానికి ఫైన్!

థియేటర్‌లో ఏసీ లేదు.. యాజమాన్యానికి ఫైన్!

థియేటర్‌లో ఓ వ్యక్తికి ఉక్కపోసింది. దీంతో యాజమాన్యం ఆయనకు టికెట్ డబ్బులు రీఫండ్ చేయడంతో పాటు.. మరో మూడు వేలు చేతులో పెట్టింది. బంపర్ ఆఫర్ లా అనిపిస్తుంది కదా? కాకపోతే పెద్ద కేసు అయిన తర్వాత థియేటర్ యాజమాన్యం కోర్టు ఆదేశాలతో ఈ చెల్లింపులు జరిపింది. 

 

Read More ఇందిరమ్మ ఇండ్లు త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ కు చెందిన నేరోళ్ల నిష్పర్‌ అనే వ్యక్తి గతేడాది ఏప్రిల్‌ 28న అబిడ్స్‌లోని ‘ముక్త ఏ2 సినిమాస్‌’ థియేటర్‌కు వెళ్లారు. అక్కడ ‘కిసీ కా భాయ్‌.. కిసీ కా జాన్‌’ సినిమా చూశాడు. తన బైక్ పార్కింగ్‌కు రూ.20 ఫీజు, సినిమా టికెట్‌కు రూ.150 కట్టారు. థియేటర్‌లో ఏసీలు ఉన్నా.. అవి పని చేయలేదు. ఇక అక్కడక్కడ ఉన్న ఫ్యాన్లతో గాలి అంతంతమాత్రంగానే వీసింది. దీంతో ఆయన తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఇంటర్వెల్‌ సమయంలో ఈ సమస్యను యాజమాన్యం దృష్టికి తీసుకొని వెళ్లాడు. కానీ.. వారిని నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. సమస్య పరిష్కరించకపోగా నేరోళ్ల నిష్పర్‌‌పై అక్కడి సిబ్బంది దుర్భాషలాడి దురుసుగా ప్రవర్తించారని బాధితుడు వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేశాడు. 

 

గోల్డ్‌ క్లాస్‌ సీట్‌లోనూ ఏసీ ఏర్పాటు చేయలేదని కంప్లైంట్ చేశాడు. తెలంగాణ సినిమాస్‌ చట్టం- 1955 ప్రకారం రూ.110 ఉండాల్సిన టికెట్‌ ధరను రూ.150కు పెంచి అమ్ముతున్నారని ఆరోపించారు. దీంతో.. వినియోగదారుల కమిషన్ థియేటర్ యాజమాన్యానికి నోటీసులు పంపింది. కానీ.. ఫిర్యాదు దారుడి ఆరోపణల్లో నిజం లేదని వాదించింది. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత టికెట్ డబ్బు రీ ఫండ్ చేసి మూడువేలు చెతికి ఇవ్వాలని చెప్పింది. అంతేకాదు..కేసు ఖర్చులు కూడా చెల్లించాలని ప్రకటించింది.

🕒 27 May 2024 ✍️ Desk

థియేటర్‌లో ఏసీ లేదు.. యాజమాన్యానికి ఫైన్!

థియేటర్‌లో ఓ వ్యక్తికి ఉక్కపోసింది. దీంతో యాజమాన్యం ఆయనకు టికెట్ డబ్బులు రీఫండ్ చేయడంతో పాటు.. మరో మూడు వేలు చేతులో పెట్టింది. బంపర్ ఆఫర్ లా అనిపిస్తుంది కదా? కాకపోతే పెద్ద కేసు అయిన తర్వాత థియేటర్ యాజమాన్యం కోర్టు ఆదేశాలతో ఈ చెల్లింపులు జరిపింది. 

 

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ కు చెందిన నేరోళ్ల నిష్పర్‌ అనే వ్యక్తి గతేడాది ఏప్రిల్‌ 28న అబిడ్స్‌లోని ‘ముక్త ఏ2 సినిమాస్‌’ థియేటర్‌కు వెళ్లారు. అక్కడ ‘కిసీ కా భాయ్‌.. కిసీ కా జాన్‌’ సినిమా చూశాడు. తన బైక్ పార్కింగ్‌కు రూ.20 ఫీజు, సినిమా టికెట్‌కు రూ.150 కట్టారు. థియేటర్‌లో ఏసీలు ఉన్నా.. అవి పని చేయలేదు. ఇక అక్కడక్కడ ఉన్న ఫ్యాన్లతో గాలి అంతంతమాత్రంగానే వీసింది. దీంతో ఆయన తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఇంటర్వెల్‌ సమయంలో ఈ సమస్యను యాజమాన్యం దృష్టికి తీసుకొని వెళ్లాడు. కానీ.. వారిని నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. సమస్య పరిష్కరించకపోగా నేరోళ్ల నిష్పర్‌‌పై అక్కడి సిబ్బంది దుర్భాషలాడి దురుసుగా ప్రవర్తించారని బాధితుడు వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేశాడు. 

 

గోల్డ్‌ క్లాస్‌ సీట్‌లోనూ ఏసీ ఏర్పాటు చేయలేదని కంప్లైంట్ చేశాడు. తెలంగాణ సినిమాస్‌ చట్టం- 1955 ప్రకారం రూ.110 ఉండాల్సిన టికెట్‌ ధరను రూ.150కు పెంచి అమ్ముతున్నారని ఆరోపించారు. దీంతో.. వినియోగదారుల కమిషన్ థియేటర్ యాజమాన్యానికి నోటీసులు పంపింది. కానీ.. ఫిర్యాదు దారుడి ఆరోపణల్లో నిజం లేదని వాదించింది. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత టికెట్ డబ్బు రీ ఫండ్ చేసి మూడువేలు చెతికి ఇవ్వాలని చెప్పింది. అంతేకాదు..కేసు ఖర్చులు కూడా చెల్లించాలని ప్రకటించింది.

🔗 https://www.vishvambhara.com/telangana/there-is-no-ac-in-the-theater-fine-by-the/article-925

Related Posts

Advertisement

LatestNews

విప్లవ, కళా యోధుల ఆశయాలు  సాధిద్దాం. - సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పిలుపు .
20న చలో కలెక్టరేట్ . -వంగూరు రాములు పిలుపు .
చేనేత వస్త్ర ప్రదర్శనకు ముఖ్య అతిధిగా రావాలని మంత్రి తుమ్మలకు ఆహ్వానం - -తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ్ 
చేనేత వస్త్ర ప్రదర్శనకు రావాలని ఎమ్మెల్సీ ఎల్ .రమణకు ఆహ్వానం - -తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ్ 
ఎస్సీ మోర్చా తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ ను కలిసిన మాదరి చంద్రశేఖర్ 
ఈ నెల 17 న చేనేత వస్త్ర ప్రదర్శన.  - గుంటక రూప సదాశివ్
మానవత్వం చాటుకున్న గద్దె విజయ్ నేత - దివ్యాంగురాలుకి  వీల్ చైర్ అందజేత.