పిల్లోనిగూడ గ్రామంలో విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సు
విశ్వంభర, శంషాబాద్: పిల్లోనిగూడ గ్రామం నుండి పాలమకుల మోడల్ స్కూల్ విద్యార్థుల కోసం ఈరోజు ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని ప్రారంభించారు. ఈ బస్సు ఉదయం 8:30 గంటలకు విద్యార్థులను స్కూల్కు తీసుకెళ్తూ, సాయంత్రం 4:30 గంటలకు తిరిగి గ్రామానికి తీసుకువస్తుంది. రోజుకు రెండు ట్రిప్పులు నిర్వహించబడుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ పానుగంటి స్వర్ణలత నరసింహ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పిల్లి శ్రీశైలం ముదిరాజ్, మాజీ సర్పంచ్ కర్రే బుచ్చమ్మ, వార్డు సభ్యులు మహేష్ ముదిరాజ్, కృష్ణ, గణేష్, అలాగే గ్రామ నాయకులు జుర్కి రమేష్ పటేల్, పి. సుధాకర్, స్కూల్ పిల్లలు కూడ ఉత్సాహంగా పాల్గొన్నారు.
పిల్లోనిగూడ గ్రామంలో విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సు
విశ్వంభర, శంషాబాద్: పిల్లోనిగూడ గ్రామం నుండి పాలమకుల మోడల్ స్కూల్ విద్యార్థుల కోసం ఈరోజు ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని ప్రారంభించారు. ఈ బస్సు ఉదయం 8:30 గంటలకు విద్యార్థులను స్కూల్కు తీసుకెళ్తూ, సాయంత్రం 4:30 గంటలకు తిరిగి గ్రామానికి తీసుకువస్తుంది. రోజుకు రెండు ట్రిప్పులు నిర్వహించబడుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ పానుగంటి స్వర్ణలత నరసింహ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పిల్లి శ్రీశైలం ముదిరాజ్, మాజీ సర్పంచ్ కర్రే బుచ్చమ్మ, వార్డు సభ్యులు మహేష్ ముదిరాజ్, కృష్ణ, గణేష్, అలాగే గ్రామ నాయకులు జుర్కి రమేష్ పటేల్, పి. సుధాకర్, స్కూల్ పిల్లలు కూడ ఉత్సాహంగా పాల్గొన్నారు.


