విద్యుదాఘాతంతో పశువులు మృతి
విశ్వంభర, మహబూబాబాద్: లక్ష్మ తండా గ్రామపంచాయతీలో ( పర్వతగిరి ) రెండు పశువులు విద్యుత్ షాకుతో మృతి చెందినాయి . రైతు బాదావత్ బాలాజీ అనే రైతువి మృతి చెందిన పశువు విలువ 70,000 రూపాయలు , భూఖ్య సీతారం అనే రైతువి మృతి చెందిన పశువు విలువ 80, 000 రూపాయలు ఉంటాయని రైతులు రోధిస్తూ తెలిపారు . ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, మా జీవనాధారం పశువులు అని , పశువులు లేనిది మా జీవితం లేదని, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోని మా పశువులు మరణించాయని తక్షణమే, సంబంధిత అధికారులు స్పందించి మాకు తగిన న్యాయం చేయాలని వేడు కున్నారు . విషయం తెలుసుకున్న లక్ష్మ తండా గ్రామ సర్పంచ్ గుగులోతు ఈశ్వరి , సర్పంచ్ భర్త రవికుమార్, మృతి చెందిన పశువుల యజమానులను పరామర్శించి ప్రభుత్వ పరంగా నష్టపరిహారం అందేలా చూస్తానని రైతులకు హామీ ఇచ్చారు .
విద్యుదాఘాతంతో పశువులు మృతి
విశ్వంభర, మహబూబాబాద్: లక్ష్మ తండా గ్రామపంచాయతీలో ( పర్వతగిరి ) రెండు పశువులు విద్యుత్ షాకుతో మృతి చెందినాయి . రైతు బాదావత్ బాలాజీ అనే రైతువి మృతి చెందిన పశువు విలువ 70,000 రూపాయలు , భూఖ్య సీతారం అనే రైతువి మృతి చెందిన పశువు విలువ 80, 000 రూపాయలు ఉంటాయని రైతులు రోధిస్తూ తెలిపారు . ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, మా జీవనాధారం పశువులు అని , పశువులు లేనిది మా జీవితం లేదని, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోని మా పశువులు మరణించాయని తక్షణమే, సంబంధిత అధికారులు స్పందించి మాకు తగిన న్యాయం చేయాలని వేడు కున్నారు . విషయం తెలుసుకున్న లక్ష్మ తండా గ్రామ సర్పంచ్ గుగులోతు ఈశ్వరి , సర్పంచ్ భర్త రవికుమార్, మృతి చెందిన పశువుల యజమానులను పరామర్శించి ప్రభుత్వ పరంగా నష్టపరిహారం అందేలా చూస్తానని రైతులకు హామీ ఇచ్చారు .


