కొత్తగూడలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ప్రారంభించిన మంత్రి సీతక్క
- ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు ప్రారంభం
విశ్వంభర, మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో నూతన ప్రభుత్వ డిగ్రీ కళాశాలను తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క సోమవారం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉన్నత విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగూడలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసిందన్నారు. ఈ అవకాశాన్ని స్థానిక విద్యార్థులు సద్వినియోగం చేసుకొని కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా నూకల రామచంద్రారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, పాకాల-కొత్తగూడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డా. బి. లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ, 2026–27 విద్యా సంవత్సరం నుంచి కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభమైనట్లు తెలిపారు. పరిసర ప్రాంతాల విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి బి.ఏ. (ఇంగ్లీష్ మీడియం), బి.కాం (కంప్యూటర్ సైన్స్ – ఇంగ్లీష్ మీడియం), బి.ఎస్సీ (లైఫ్ సైన్సెస్ – ఇంగ్లీష్ మీడియం), బి.ఎస్సీ (ఫిజికల్ సైన్సెస్ – ఇంగ్లీష్ మీడియం) కోర్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రతి కోర్సులో కేవలం 60 సీట్లు మాత్రమే ఉండటంతో విద్యార్థులు త్వరగా అడ్మిషన్ పొందాలని సూచించారు. అడ్మిషన్లకు సంబంధించిన పూర్తి వివరాల కోసం 99081 27796 నంబర్ను సంప్రదించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎటూరునాగారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లెనిన్ వత్సల్ టొప్పో, ఆర్డీవో అలివేలు, డిగ్రీ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ డా. బి. లక్ష్మణ్ నాయక్తో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కొత్తగూడలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ప్రారంభించిన మంత్రి సీతక్క
విశ్వంభర, మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో నూతన ప్రభుత్వ డిగ్రీ కళాశాలను తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క సోమవారం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉన్నత విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగూడలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసిందన్నారు. ఈ అవకాశాన్ని స్థానిక విద్యార్థులు సద్వినియోగం చేసుకొని కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా నూకల రామచంద్రారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, పాకాల-కొత్తగూడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డా. బి. లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ, 2026–27 విద్యా సంవత్సరం నుంచి కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభమైనట్లు తెలిపారు. పరిసర ప్రాంతాల విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి బి.ఏ. (ఇంగ్లీష్ మీడియం), బి.కాం (కంప్యూటర్ సైన్స్ – ఇంగ్లీష్ మీడియం), బి.ఎస్సీ (లైఫ్ సైన్సెస్ – ఇంగ్లీష్ మీడియం), బి.ఎస్సీ (ఫిజికల్ సైన్సెస్ – ఇంగ్లీష్ మీడియం) కోర్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రతి కోర్సులో కేవలం 60 సీట్లు మాత్రమే ఉండటంతో విద్యార్థులు త్వరగా అడ్మిషన్ పొందాలని సూచించారు. అడ్మిషన్లకు సంబంధించిన పూర్తి వివరాల కోసం 99081 27796 నంబర్ను సంప్రదించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎటూరునాగారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లెనిన్ వత్సల్ టొప్పో, ఆర్డీవో అలివేలు, డిగ్రీ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ డా. బి. లక్ష్మణ్ నాయక్తో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


