కేవీఆర్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
విశ్వంభర, ఎల్బీ నగర్: బైరామల్గూడలో నివాసముంటున్న జర్నలిస్టు కే. వెంకట్ రామ్ రెడ్డి (కేవీఆర్)ను ఇటీవల ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో, ఆయన కుటుంబ సభ్యులను మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని సూచిస్తూ, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటుందని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డాక్టర్ రామ్ నరసింహ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు బింగి భరత్ గౌడ్, సూర్వి యాదయ్య గౌడ్, యాదగిరి, తుప్పటి శ్రీకాంత్, నవీన్ చారి తదితరులు పాల్గొన్నారు.
కేవీఆర్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
విశ్వంభర, ఎల్బీ నగర్: బైరామల్గూడలో నివాసముంటున్న జర్నలిస్టు కే. వెంకట్ రామ్ రెడ్డి (కేవీఆర్)ను ఇటీవల ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో, ఆయన కుటుంబ సభ్యులను మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని సూచిస్తూ, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటుందని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డాక్టర్ రామ్ నరసింహ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు బింగి భరత్ గౌడ్, సూర్వి యాదయ్య గౌడ్, యాదగిరి, తుప్పటి శ్రీకాంత్, నవీన్ చారి తదితరులు పాల్గొన్నారు.


