అపోహలు వీడండి - కొనో కార్పస్ మొక్కలను సంరక్షించండి

విశ్వంభర, మాడుగుల

అపోహలు వీడండి - కొనో కార్పస్ మొక్కలను సంరక్షించండి

విశ్వంభర, మాడుగుల: మానవాళి మనుగడకు ఆధారమైన మొక్కలను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మాడుగుల మండలం నర్సంపల్లి మాజీ సర్పంచ్  హనుమాన్ రాథోడ్  అన్నారు. గత ప్రభుత్వ హయాంలో తెలంగాణకు హరితహారం, పల్లె ప్రగతి లాంటి అద్భుతమైన కార్యక్రమాలలో భాగంగా నాటిన కోనో కార్పస్ మొక్కలపై లేనిపోని అపోహలు సృష్టించి వాటిని తొలగించడం దారుణమని అన్నారు. ఏ విధమైన శాస్త్రీయ ఆధారాలు లేకుండా ఏపుగా పెరిగిన కోనో కార్పస్ మొక్కలను నరికి వేయడం చాలా బాధాకరమైన విషయమని వాపోయారు.కోనో కార్పస్ మొక్కలపై కొన్ని సంవత్సరాలుగా వృక్ష శాస్త్రవేత్తలు ఏ ఆర్ రెడ్డి, మోహన్ రావు, బి.యన్.రెడ్డి, లక్ష్మణ రెడ్డి పరిశోధనలు చేసి ఈ మొక్కల వలన మానవ మనుగడకు ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేసినట్లు తెలిపారు. కోనో కార్పస్ మొక్కలు మిగతా మొక్కల కంటే ఎక్కువగా కార్బన్ డయాక్సైడ్ ను తీసుకొని మానవ మనుగడకు ఆధారమైన ఆక్సిజన్ ను ఎక్కువ మోతాదులో అందిస్తుందని వివరించారు. భూగర్భ జలాలను అధికంగా తీసుకుంటుందని, అదేవిధంగా ఆక్సిజన్ ను తీసుకొని కార్బన్ డయాక్సైడ్ ను విడుదల చేస్తుందనే కృత్రిమ అపోహలను ఎవరు నమ్మొద్దని సూచించారు. తెలుగు రాష్ట్రాలలో ఈ అపోహలను నమ్మి ఇప్పటికే చాలా మొక్కలు నరికారని ఇకపై ఇలాంటి చర్యలకు స్వస్తి పలకాలని కోరారు. మొక్కలను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, పచ్చదనం భవిష్యత్తు తరాలకు మనమందించే వరమని  హనుమాన్ రాథోడ్ సూచించారు.

Tags: