కార్గిల్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి: గడ్డి అన్నారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు
విశ్వంభర, గడ్డి అన్నారం : కార్గిల్ అమరవీరుల త్యాగాలు మరువలేనివని గడ్డి అన్నారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు
మద్దెల సునీల్ బాబు అన్నారు. సునీల్ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమర వీర జవాన్లకు ఘన నివాళులర్పిస్తూ పెద్ద ఎత్తున దిల్సుఖ్నగర్ రాజీవ్ చౌక్ నుండి పీఎన్టీ కాలనీ వరకు భారీ పాదయాత్ర , క్యాండిల్ ర్యాలీ నిర్వహించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని "వందే మాతరం", "భారత్ మాతాకీ జై", "అమర వీర జవాన్లకు జోహార్లు" అంటూ నినాదాలు చేస్తూ అమర వీరుల త్యాగస్ఫూర్తిని స్మరించుకున్నారు. దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను అర్పించిన కార్గిల్ అమర వీరులకు శిరసావహించి, వారి త్యాగం ఎల్లప్పుడూ దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకమనీ పేర్కొన్నారు. కార్యక్రమంలో బద్దుల వేణు యాదవ్, , మహిళా అధ్యక్షురాలు శశికళ, వన్నాడి శ్రీనివాస్ , హసీనా , మంజుల , సుశీల , గోవర్ధన్ , సురేష్ నాయుడు , నవీన్ గౌడ్ , సురేష్ ముదిరాజ్, కృష్ణ , కుమార్ , విజయ్ , సన్నాయి శ్రీనివాస్ , గంధం వేణు , శ్రీనివాస్ గౌడ్, ధర్మరాజు , శరత్ యాదవ్ , శ్రీను , వినోద్ , కిషన్ తదితరులు పాల్గొన్నారు.
కార్గిల్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి: గడ్డి అన్నారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు
విశ్వంభర, గడ్డి అన్నారం : కార్గిల్ అమరవీరుల త్యాగాలు మరువలేనివని గడ్డి అన్నారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు
మద్దెల సునీల్ బాబు అన్నారు. సునీల్ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమర వీర జవాన్లకు ఘన నివాళులర్పిస్తూ పెద్ద ఎత్తున దిల్సుఖ్నగర్ రాజీవ్ చౌక్ నుండి పీఎన్టీ కాలనీ వరకు భారీ పాదయాత్ర , క్యాండిల్ ర్యాలీ నిర్వహించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని "వందే మాతరం", "భారత్ మాతాకీ జై", "అమర వీర జవాన్లకు జోహార్లు" అంటూ నినాదాలు చేస్తూ అమర వీరుల త్యాగస్ఫూర్తిని స్మరించుకున్నారు. దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను అర్పించిన కార్గిల్ అమర వీరులకు శిరసావహించి, వారి త్యాగం ఎల్లప్పుడూ దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకమనీ పేర్కొన్నారు. కార్యక్రమంలో బద్దుల వేణు యాదవ్, , మహిళా అధ్యక్షురాలు శశికళ, వన్నాడి శ్రీనివాస్ , హసీనా , మంజుల , సుశీల , గోవర్ధన్ , సురేష్ నాయుడు , నవీన్ గౌడ్ , సురేష్ ముదిరాజ్, కృష్ణ , కుమార్ , విజయ్ , సన్నాయి శ్రీనివాస్ , గంధం వేణు , శ్రీనివాస్ గౌడ్, ధర్మరాజు , శరత్ యాదవ్ , శ్రీను , వినోద్ , కిషన్ తదితరులు పాల్గొన్నారు.


