V3 న్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
జాతీయ పతాక ఆవిష్కరించిన విత్రీ న్యూస్ ఛానల్ , విశ్వంభర దిన పత్రిక సిఎండి డా కాచం సత్యనారాయణ
On
ప్రజా విశ్వంభర, హైద్రాబాద్ : చైతన్యపురి V3 న్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయంలో 79 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలును ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో విత్రీ న్యూస్ ఛానల్ , విశ్వంభర దిన పత్రిక సిఎండి లయన్ డా. కాచం సత్యనారాయణ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు స్వాతంత్య్ర సమారయోధుల త్యాగాలను గుర్తు చేసుకొని వారి చేసిన కృషిని కొనియాడారు. వారి పోరాట పటిమను ఆదర్శంగా తీసుకొని దేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కాసం సాయి, సీనియర్ కరెస్పాండెంట్స్ దుమ్మాజి నవీన్ కుమార్ , ఏలే మహేష్ నేత , విశ్వంభర దినపత్రిక బ్యూరో చీఫ్ పోతుగంటి వెంకట రమణ , న్యూస్ ప్రేసెంటెర్ ఎమిలియా సీనియర్ గ్రాఫిక్ డిజైనర్ మేడికొండ పరమేష్ , మార్కెటింగ్ మేనేజర్ రాజు , సీనియర్ వీడియో జర్నలిస్ట్స్ గజవెళ్లి గురుమూర్తి , ఎలగందుల అఖిల్ , వీడియో ఎడిటర్ సాయి తదితరులు పాల్గొన్నారు.



