20న గ్లోబల్ ఇండస్ట్రీ పార్ట్ననర్ షిప్ సమ్మిట్
On
విశ్వంభర, మేడ్చల్: మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజక వర్గం మల్లా రెడ్డి యూనివర్సిటీలో మైసమ్మగూడలో బహుళ కంపెనీ భాగస్వామ్యాలతో ఈ 20న గ్లోబల్ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ సమ్మిట్ నిర్వహిస్తామని యూనివర్సిటీ వైస్ చాన్సలర్ తెలిపారు. మల్లారెడ్డి యూనివర్సిటీలో జరిగిన విలేఖరుల సమావేశం లో మాట్లాడుతూ ఫిబ్రవరి 20న ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు యూనివర్సిటీ ప్రాంగణంలో “గ్లోబల్ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ సమ్మిట్”కు సంబంధిచిన బ్రోచర్ ఆవిష్కరించారు. ఈ విలేఖరుల సమావేశంలో వైస్ ఛాన్సలర్ డా. వి.ఎస్.కే. రెడ్డి, రిజిస్టర్ డా. కె. శ్రీనివాసరావు, డైరక్టర్ లు డా"భద్రారెడ్డి,డా" ప్రీతీరెడ్డి,,షాలీనీ మహేందర్ రెడ్డి, పోగ్రామ్ కో- ఆర్డినేటర్ డా. నేమాని సుభాష్, ఇంజినీరింగ్ విభాగాల డీన్లు పాల్గొన్నారు...



