చిన్ననాటి మిత్రుని కుటుంబానికి ఆర్థిక సాయం
On
విశ్వంభర, రామన్నపేట: అనారోగ్యంతో అకాల మరణం పొందిన చిన్ననాటి స్నేహితుని కుటుంబానికి అండగా మేమున్నామంటూ ముందుకువచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రానికి చెందిన గురుకు శివప్రసాద్ ఇటీవల అనారోగ్యంతో అకాల మరణం చెందారు. విషయం తెలుసుకున్న రామన్నపేట ప్రభుత్వ పాఠశాల 2006-07 పదవ తరగతి బ్యాచ్ మిత్రులు తమ వంతుగా మిత్రుని కుటుంబానికి అండగా నిలవాలని సంకల్పించారు. రూ.22,000 నగదును బుధవారం మృతుని దశదినకర్మ రోజు కుటుంబ సభ్యులకు అందజేశారు.



