మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే మురళి నాయక్
విశ్వంభర, మహబూబాబాద్: మండలo సొమ్ల తండ గ్రామంలో భూక్య బాల్య అనే వృద్ధుడు ఈ మధ్యకాలంలో మరణించడంతో ఈరోజు మృతుడి కుటుంబాన్ని మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్ పరామర్శించి , మృతుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళి నాయక్ మాట్లాడుతూ మృతుడి భూక్య బాలునాయక్ కుటుంబం చాలా ఉన్నతమైన కుటుంబమని, మృతుడి కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటుందని , ఎప్పుడు ఏం అవసరం వచ్చినా నేరుగా నన్ను కలవచ్చని , మీరు ఆధైర్యం పడవద్దని ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకి ధైర్యాన్నిచ్చారు . ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జిల్లా భూక్య దళ్ సింగ్ , సోమలతన్న మాజీ సర్పంచి , బాలాజీ, ఉపసర్పంచ్ అమర్ సింగ్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు , కాంగ్రెస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షులు , ఇందిరమ్మ కమిటీ సభ్యులు ,సోమల తండా గ్రామస్తులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు.
మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే మురళి నాయక్
విశ్వంభర, మహబూబాబాద్: మండలo సొమ్ల తండ గ్రామంలో భూక్య బాల్య అనే వృద్ధుడు ఈ మధ్యకాలంలో మరణించడంతో ఈరోజు మృతుడి కుటుంబాన్ని మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్ పరామర్శించి , మృతుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళి నాయక్ మాట్లాడుతూ మృతుడి భూక్య బాలునాయక్ కుటుంబం చాలా ఉన్నతమైన కుటుంబమని, మృతుడి కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటుందని , ఎప్పుడు ఏం అవసరం వచ్చినా నేరుగా నన్ను కలవచ్చని , మీరు ఆధైర్యం పడవద్దని ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకి ధైర్యాన్నిచ్చారు . ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జిల్లా భూక్య దళ్ సింగ్ , సోమలతన్న మాజీ సర్పంచి , బాలాజీ, ఉపసర్పంచ్ అమర్ సింగ్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు , కాంగ్రెస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షులు , ఇందిరమ్మ కమిటీ సభ్యులు ,సోమల తండా గ్రామస్తులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు.


