ముఖ్యమంత్రుల సహకారం తో  సంగారెడ్డి రాజీవ్ పార్క్ అభివృద్ధి

ముఖ్యమంత్రుల సహకారం తో  సంగారెడ్డి రాజీవ్ పార్క్ అభివృద్ధి

  • - ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి  మంజూరు  చేస్తే ,  సీఎం రోశయ్య  శంకుస్థాపన చేశారు, కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంబించారు.
  • - ⁠తిరిగి మరలా సుందరీకరణ తర్వాత త్వరలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు : జగ్గారెడ్డి

విశ్వంభర,  సంగారెడ్డి:  సంగారెడ్డి రాజీవ్ పార్క్ ఏర్పాటు, అభివృద్ధి లో నలుగురు ముఖ్యమంత్రుల సహకారం ఉందని జగ్గారెడ్డి అన్నారు. గురువారం ఆయన రాజీవ్ పార్క్ ను సందర్శించి , పార్క్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. పార్క్ మొత్తం కలియ తిరుగుతూ జరుగుతున్న, జరగాల్సిన అభివృద్ధి పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పార్క్ లో నూతనంగా ఏర్పాటు చేసిన వ్యాయామ పరికరాలను స్వయంగా పరిశీలించారు. ఫౌంటెన్ పునరుద్దన పనులను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి రాజీవ్ పార్క్ కు అనుమతులు మంజూరు చేశారన్నారు. అనంతరం  సీఎం రోశయ్య  శంకుస్థాపన చేయగా, సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారన్నారు. పదేళ్ల బిఆర్ఎస్  కాలం లో రాజీవ్ పార్క్ పూర్తిగా చెడిపోయి నిరుపయోగంగా మారి శిథిలావస్థకు చేరుకుంద ని అన్నారు. తిరిగి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారం తో,    మున్సిపల్  అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ    టీ కే  శ్రీదేవి సహకారం తో మరో రూ. 3 కోట్ల నిధుల తో రాజీవ్ పార్క్ ను మొదటి దశగా అభివృద్ధి చేశామని, మరో రూ. 6 కోట్ల రూపాయల నిధుల తో అభివృద్ధి చేయనున్నామని తెలిపారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో రాజీవ్ పార్క్ ను తిరిగి ప్రారంభిస్తమని వివరించారు.ఈ కార్యక్రమంలో   టీ పిసిసి ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్ కిశన్ నాయకులు బొంగుల రవి, కూన సంతోష్,   మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ హఫీజ్, టౌన్ ప్రెసిడెంట్ కిరణ్ గౌడ్, శ్రీహరి, కౌన్సిలర్ లు మహేష్, నవాజ్ , మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

🕒 31 Jul 2026 ✍️ Desk

ముఖ్యమంత్రుల సహకారం తో  సంగారెడ్డి రాజీవ్ పార్క్ అభివృద్ధి

విశ్వంభర,  సంగారెడ్డి:  సంగారెడ్డి రాజీవ్ పార్క్ ఏర్పాటు, అభివృద్ధి లో నలుగురు ముఖ్యమంత్రుల సహకారం ఉందని జగ్గారెడ్డి అన్నారు. గురువారం ఆయన రాజీవ్ పార్క్ ను సందర్శించి , పార్క్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. పార్క్ మొత్తం కలియ తిరుగుతూ జరుగుతున్న, జరగాల్సిన అభివృద్ధి పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పార్క్ లో నూతనంగా ఏర్పాటు చేసిన వ్యాయామ పరికరాలను స్వయంగా పరిశీలించారు. ఫౌంటెన్ పునరుద్దన పనులను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి రాజీవ్ పార్క్ కు అనుమతులు మంజూరు చేశారన్నారు. అనంతరం  సీఎం రోశయ్య  శంకుస్థాపన చేయగా, సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారన్నారు. పదేళ్ల బిఆర్ఎస్  కాలం లో రాజీవ్ పార్క్ పూర్తిగా చెడిపోయి నిరుపయోగంగా మారి శిథిలావస్థకు చేరుకుంద ని అన్నారు. తిరిగి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారం తో,    మున్సిపల్  అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ    టీ కే  శ్రీదేవి సహకారం తో మరో రూ. 3 కోట్ల నిధుల తో రాజీవ్ పార్క్ ను మొదటి దశగా అభివృద్ధి చేశామని, మరో రూ. 6 కోట్ల రూపాయల నిధుల తో అభివృద్ధి చేయనున్నామని తెలిపారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో రాజీవ్ పార్క్ ను తిరిగి ప్రారంభిస్తమని వివరించారు.ఈ కార్యక్రమంలో   టీ పిసిసి ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్ కిశన్ నాయకులు బొంగుల రవి, కూన సంతోష్,   మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ హఫీజ్, టౌన్ ప్రెసిడెంట్ కిరణ్ గౌడ్, శ్రీహరి, కౌన్సిలర్ లు మహేష్, నవాజ్ , మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

🔗 https://www.vishvambhara.com/telangana/development-of-sangareddy-rajiv-park-with-the-cooperation-of-chief/article-20471

Tags: