సీఎంఆర్ఎఫ్ తో పేదలకు మెరుగైన వైద్యం
On
విశ్వంభర, బొంరాస్ పేట్ : ముఖ్యమంత్రి సహాయ నిధి పథకంతో పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్ రాములు గౌడ్ అన్నారు. శుక్రవారం ఎరుపు మల్ల గ్రామానికి చెందిన మామిళ్ళ హన్మమ్మకు మంజూరైన రూ. 50500 సిఎంఆర్ఎఫ్ చెక్కును స్థానిక సర్పంచ్ బందేయతో కలిసి బాధితురాలికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కాకర్ల గండి తాండ సర్పంచ్ బాల్య నాయక్, నాయకులు చిన్న నరసింహులు, ఎల్లప్ప గౌడ్ ,అనంతయ్య, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.



