23న కలెక్టరేట్ల ముట్టడికి ఏఐఎస్ఎఫ్ పిలుపు
విశ్వంభర, హిమాయత్నగర్ : పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 23న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ తెలిపారు. హైదరాబాదు హిమాయత్నగర్లో చలో కలెక్టరేట్ల గోడపత్రికను ఆవిష్కరించిన సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించి బకాయిలను విడుదల చేయాలని, ప్రైవేట్ కళాశాలల్లో నిలిచిపోయిన విద్యార్థుల ధ్రువపత్రాలను అందజేయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు సామిడి వంశీవర్ధన్ రెడ్డి, మహమ్మద్ అన్వర్ తదితరులు పాల్గొన్నారు.
23న కలెక్టరేట్ల ముట్టడికి ఏఐఎస్ఎఫ్ పిలుపు
విశ్వంభర, హిమాయత్నగర్ : పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 23న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ తెలిపారు. హైదరాబాదు హిమాయత్నగర్లో చలో కలెక్టరేట్ల గోడపత్రికను ఆవిష్కరించిన సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించి బకాయిలను విడుదల చేయాలని, ప్రైవేట్ కళాశాలల్లో నిలిచిపోయిన విద్యార్థుల ధ్రువపత్రాలను అందజేయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు సామిడి వంశీవర్ధన్ రెడ్డి, మహమ్మద్ అన్వర్ తదితరులు పాల్గొన్నారు.


