ఘనంగా ఎంఈఓ రూపారాణి పదవీ విరమణ వేడుక

ఘనంగా ఎంఈఓ రూపారాణి పదవీ విరమణ వేడుక

విశ్వంభర, ఇనుగుర్తి: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల ఎంఈఓ, స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జంగ రూపారాణి పదవీ విరమణ వేడుకను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఇన్‌చార్జి హెచ్‌ఎం అమ్మ యాకయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, వివిధ మండలాల ఎంఈఓలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, బంధుమిత్రులు రూపారాణి దంపతులను శాలువాలు, జ్ఞాపికలతో సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు రూపారాణి క్రమశిక్షణ, సమయపాలనలో ఆదర్శంగా నిలిచారని, ఆమె నాయకత్వంలో పాఠశాల పదో తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించిందని కొనియాడారు. పదవీ విరమణ ఉద్యోగానికేనని, సేవకు కాదని పేర్కొన్నారు. రూపారాణి మాట్లాడుతూ తన ఉద్యోగ జీవితం ఎంతో సంతృప్తినిచ్చిందని, సహకరించిన ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రెండు దశాబ్దాలకుపైగా విద్యార్థులు, ఉపాధ్యాయులతో ఏర్పడిన అనుబంధాన్ని ఎప్పటికీ మరువలేనని భావోద్వేగంగా పేర్కొన్నారు.

🕒 01 Jul 2026 ✍️ Desk

ఘనంగా ఎంఈఓ రూపారాణి పదవీ విరమణ వేడుక

విశ్వంభర, ఇనుగుర్తి: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల ఎంఈఓ, స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జంగ రూపారాణి పదవీ విరమణ వేడుకను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఇన్‌చార్జి హెచ్‌ఎం అమ్మ యాకయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, వివిధ మండలాల ఎంఈఓలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, బంధుమిత్రులు రూపారాణి దంపతులను శాలువాలు, జ్ఞాపికలతో సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు రూపారాణి క్రమశిక్షణ, సమయపాలనలో ఆదర్శంగా నిలిచారని, ఆమె నాయకత్వంలో పాఠశాల పదో తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించిందని కొనియాడారు. పదవీ విరమణ ఉద్యోగానికేనని, సేవకు కాదని పేర్కొన్నారు. రూపారాణి మాట్లాడుతూ తన ఉద్యోగ జీవితం ఎంతో సంతృప్తినిచ్చిందని, సహకరించిన ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రెండు దశాబ్దాలకుపైగా విద్యార్థులు, ఉపాధ్యాయులతో ఏర్పడిన అనుబంధాన్ని ఎప్పటికీ మరువలేనని భావోద్వేగంగా పేర్కొన్నారు.

🔗 https://www.vishvambhara.com/telangana/a-grand-retirement-ceremony-for-meo-ruparani/article-17490

Tags:  

Advertisement

LatestNews

విప్లవ, కళా యోధుల ఆశయాలు  సాధిద్దాం. - సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పిలుపు .
20న చలో కలెక్టరేట్ . -వంగూరు రాములు పిలుపు .
చేనేత వస్త్ర ప్రదర్శనకు ముఖ్య అతిధిగా రావాలని మంత్రి తుమ్మలకు ఆహ్వానం - -తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ్ 
చేనేత వస్త్ర ప్రదర్శనకు రావాలని ఎమ్మెల్సీ ఎల్ .రమణకు ఆహ్వానం - -తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ్ 
ఎస్సీ మోర్చా తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ ను కలిసిన మాదరి చంద్రశేఖర్ 
ఈ నెల 17 న చేనేత వస్త్ర ప్రదర్శన.  - గుంటక రూప సదాశివ్
మానవత్వం చాటుకున్న గద్దె విజయ్ నేత - దివ్యాంగురాలుకి  వీల్ చైర్ అందజేత.