ఉత్సాహంగా సమ్మర్ కోచింగ్ క్యాంపు క్రికెట్ టోర్నమెంట్స్
- మహబూబాద్ క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బి.అజయ్ సారధి రెడ్డి వెల్లడి
విశ్వంభర, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గత 4 రోజులుగా సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంప్ క్రీడాకారులకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని 3 గ్రౌండ్స్ ఎన్టీఆర్ స్టేడియం, శనిగపురం గ్రౌండ్, సిద్ధార్థ గ్రౌండ్ లలో అండర్ 12 అండర్ 14 అండర్ 16 అండర్ 19 క్రీడాకారులకు ఎంతో ఉత్సాహంగా ఉత్కంఠ భరితంగా టోర్నమెంట్స్ జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నేడు ముఖ్యఅతిథిగా హాజరైన మహబూబాబాద్ క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బి అజయ్ సారధి రెడ్డి క్రీడలను ప్రారంభించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మానుకోట జిల్లా క్రీడాకారులు గత నాలుగు రోజులుగా జరుగుతున్న క్రికెట్ ఓపెన్ టోర్నమెంట్ లో మంచి ప్రతిభ కనబరుస్తున్నారని భవిష్యత్తులో మంచి ఉన్నత శిఖరాలకు వెలుతారని ఆకాంక్షించారు క్యాంపులో నేర్చుకున్న మెలుకువల ద్వారా తమ యొక్క నైపుణ్యాన్ని పెంచుకొని మంచి క్రికెట్ ఆడుతున్నారన్నారు. మహబూబాబాద్ క్రికెట్ క్రీడాకారులు జరుగుతున్న టోర్నమెంట్ లో బౌలింగ్ బ్యాటింగ్ లలో విశేషంగా ప్రతిభను కనబరుస్తూ దూసుకుపోతున్నారు అన్నారు. భవిష్యత్తులో రంజి ఐపిఎల్ జాతీయ జట్టుల్లో స్థానం సంపాదించుకునే దేంగా మానుకోట క్రీడాకారులు ఎదగాలని బి అజయ్ సారధి రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంపు ద్వారా ఎంతో మంది క్రీడాకారులు వచ్చి క్రికెట్ నేర్చుకొని ముందుకు పోవాలని ఆకాంక్షించారు ఈ టోర్నమెంట్ లో చీఫ్ కోచ్ మెతుకు కుమార్, అసిస్టెంట్ కోచ్ తోట వినయ్, కుమార్ పిట్టల శ్రావణ్, పరమేశ్వర్, సాద్విత్ రెడ్డి ,చరిత్ రెడ్డి, టోర్నమెంట్ స్కోరర్ ధర్మచరణ్, రెడ్డి అనిర్వేశ్ తరుణ్, మనీష్ ,అవినాష్, జైనీల్ క్రీడాకారులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా సమ్మర్ కోచింగ్ క్యాంపు క్రికెట్ టోర్నమెంట్స్
విశ్వంభర, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గత 4 రోజులుగా సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంప్ క్రీడాకారులకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని 3 గ్రౌండ్స్ ఎన్టీఆర్ స్టేడియం, శనిగపురం గ్రౌండ్, సిద్ధార్థ గ్రౌండ్ లలో అండర్ 12 అండర్ 14 అండర్ 16 అండర్ 19 క్రీడాకారులకు ఎంతో ఉత్సాహంగా ఉత్కంఠ భరితంగా టోర్నమెంట్స్ జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నేడు ముఖ్యఅతిథిగా హాజరైన మహబూబాబాద్ క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బి అజయ్ సారధి రెడ్డి క్రీడలను ప్రారంభించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మానుకోట జిల్లా క్రీడాకారులు గత నాలుగు రోజులుగా జరుగుతున్న క్రికెట్ ఓపెన్ టోర్నమెంట్ లో మంచి ప్రతిభ కనబరుస్తున్నారని భవిష్యత్తులో మంచి ఉన్నత శిఖరాలకు వెలుతారని ఆకాంక్షించారు క్యాంపులో నేర్చుకున్న మెలుకువల ద్వారా తమ యొక్క నైపుణ్యాన్ని పెంచుకొని మంచి క్రికెట్ ఆడుతున్నారన్నారు. మహబూబాబాద్ క్రికెట్ క్రీడాకారులు జరుగుతున్న టోర్నమెంట్ లో బౌలింగ్ బ్యాటింగ్ లలో విశేషంగా ప్రతిభను కనబరుస్తూ దూసుకుపోతున్నారు అన్నారు. భవిష్యత్తులో రంజి ఐపిఎల్ జాతీయ జట్టుల్లో స్థానం సంపాదించుకునే దేంగా మానుకోట క్రీడాకారులు ఎదగాలని బి అజయ్ సారధి రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంపు ద్వారా ఎంతో మంది క్రీడాకారులు వచ్చి క్రికెట్ నేర్చుకొని ముందుకు పోవాలని ఆకాంక్షించారు ఈ టోర్నమెంట్ లో చీఫ్ కోచ్ మెతుకు కుమార్, అసిస్టెంట్ కోచ్ తోట వినయ్, కుమార్ పిట్టల శ్రావణ్, పరమేశ్వర్, సాద్విత్ రెడ్డి ,చరిత్ రెడ్డి, టోర్నమెంట్ స్కోరర్ ధర్మచరణ్, రెడ్డి అనిర్వేశ్ తరుణ్, మనీష్ ,అవినాష్, జైనీల్ క్రీడాకారులు పాల్గొన్నారు.


