అవోప అధ్యక్షడు మలిపెద్ది శంకర్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ -  రాజకీయ వైశ్య రణభేరి విజయవంతం చేయాలనీ పిలుపు

అవోప అధ్యక్షడు మలిపెద్ది శంకర్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ -  రాజకీయ వైశ్య రణభేరి విజయవంతం చేయాలనీ పిలుపు

ప్రజా విశ్వంభర, హైద్రాబాద్ ; ఆగస్టు 3వ తేదీన హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో వైశ్య వికాస వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు డా. కాచం సత్యనారాయణ గుప్త ఆధ్వర్యం లో జరిగే వైశ్య రాజకీయ రణభేరి కార్యక్రమం ను విజయవంతం చేయాలనీ అవోప అధ్యక్షడు మలిపెద్ది శంకర్ ఆధ్వర్యంలో బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో  ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైశ్య వికాస వేదిక , రాజకీయ వైశ్య రణభేరి అధ్యక్షలు డా. కాచం సత్యనారాయణ గుప్త ముఖ్య అతిధిగా హాజరై పోస్టర్ ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైశ్యుల వాటా తేల్చాల్సిందేనని అన్నారు. ఈ డబ్ల్యూ ఎస్ లో వర్గీకరణ తేవాలని అన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా వైశ్యులను గుడి , బడి వద్ద సేవ కార్యక్రమాలకు వాడుకుంటున్నారే తప్ప, రాజకీయంలో సీట్లు కేటాయించడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే నామినేటెడ్ పదవుల్లో వైశ్యులకు తగిన ప్రాధాన్యత కల్పించాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ అవోప అధ్యక్షులు   రేణికుంట్ల నమశ్శివాయ, ఉపాధ్యక్షులు రాష్ట్ర అవోప వీరబొమ్మ రమేష్ ,మేడ్చల్ జిల్లా అవోప అధ్యక్షులు పెండ్యాల నాగరాజు , రంగారెడ్డి అర్బన్ 2 జిల్లా అధ్యక్షులు బొడ్డు శ్రీధర్ , రంగారెడ్డి అర్బన్ 1అధ్యక్షులు నాగేంద్రయ్య , మేడ్చల్ జిల్లా అవోప కోశాధికారి  ఆదిమూలం సతీష్ , మహిళా విభాగ్ రంగారెడ్డి అర్బన్ 2 అవోప అధ్యక్షరాలు గజ్జల స్రవంతి , దేవిప్రియ తదితరులు పాల్గొన్నారు.

IMG-20250731-WA0025

Tags: