చండూర్ గాంధీజీ లో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు

ట్రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు 

చండూర్ గాంధీజీ లో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు

  • ఆటపాటలతో ఆకట్టుకున్న చిన్నారులు
  • సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ

విశ్వంభర, చండూర్ : దసరా సెలవులు ప్రారంభం కానున్న దృష్ట్యా ముందస్తు బతుకమ్మ సంబరాలను స్థానిక గాంధీజీ విద్యాసంస్థల్లో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షులు, గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు గౌరీదేవికి పూలమాలలు వేసి పూజ చేసి బతుకమ్మ వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కోడి శ్రీనివాసులు  మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి మరియు సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని, ఈ పండుగను తెలంగాణ ఆడపడుచులు వారి పుట్టింటిలో ఘనంగా జరుపుకుంటారని అన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ... బంధాలు మరియు అనుబంధాలను గుర్తు చేసుకుంటూ.... ఆడపడుచులు తొమ్మిది రోజులపాటు పూలతో గౌరీదేవిని పూజిస్తారని, మహాలయ అమావాస్య నాడు ఎంగిలిపూల బతుకమ్మగా ప్రారంభమై చివరి రోజు సద్దుల బతుకమ్మగా ముగుస్తుందని తెలిపారు. విద్యార్థినులు మహిళా ఉపాధ్యాయులు సాంప్రదాయ వస్త్రధారణతో, పూలతో అలంకరించుకొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రంగురంగుల బతుకమ్మలతో పాటలు పాడుతూ, నృత్యాలు చేశారు. బతుకమ్మ పండుగ పర్యావరణాన్ని ఆదరించే ఆచారానికి ప్రతీక అని పేర్కొన్నారు. సత్యం చెడుపై గెలిచే విజయదశమి సందేశం చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యాసంస్థల డైరెక్టర్  సరికొండ వెంకన్న, ప్రిన్సిపల్స్ భార్గవ్, పులిపాటి రాధిక, కందుల కృష్ణయ్య ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

🕒 20 Sep 2025 ✍️ Desk

చండూర్ గాంధీజీ లో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు

ట్రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు 

విశ్వంభర, చండూర్ : దసరా సెలవులు ప్రారంభం కానున్న దృష్ట్యా ముందస్తు బతుకమ్మ సంబరాలను స్థానిక గాంధీజీ విద్యాసంస్థల్లో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షులు, గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు గౌరీదేవికి పూలమాలలు వేసి పూజ చేసి బతుకమ్మ వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కోడి శ్రీనివాసులు  మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి మరియు సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని, ఈ పండుగను తెలంగాణ ఆడపడుచులు వారి పుట్టింటిలో ఘనంగా జరుపుకుంటారని అన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ... బంధాలు మరియు అనుబంధాలను గుర్తు చేసుకుంటూ.... ఆడపడుచులు తొమ్మిది రోజులపాటు పూలతో గౌరీదేవిని పూజిస్తారని, మహాలయ అమావాస్య నాడు ఎంగిలిపూల బతుకమ్మగా ప్రారంభమై చివరి రోజు సద్దుల బతుకమ్మగా ముగుస్తుందని తెలిపారు. విద్యార్థినులు మహిళా ఉపాధ్యాయులు సాంప్రదాయ వస్త్రధారణతో, పూలతో అలంకరించుకొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రంగురంగుల బతుకమ్మలతో పాటలు పాడుతూ, నృత్యాలు చేశారు. బతుకమ్మ పండుగ పర్యావరణాన్ని ఆదరించే ఆచారానికి ప్రతీక అని పేర్కొన్నారు. సత్యం చెడుపై గెలిచే విజయదశమి సందేశం చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యాసంస్థల డైరెక్టర్  సరికొండ వెంకన్న, ప్రిన్సిపల్స్ భార్గవ్, పులిపాటి రాధిక, కందుల కృష్ణయ్య ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

🔗 https://www.vishvambhara.com/pre-batukamma-celebrations-in-chandur-gandhiji/article-6509

Tags:  

Advertisement

LatestNews

అనంతపురం జేఎన్‌టీయూఏకు అరుదైన గౌరవం.. 80వ వార్షికోత్సవంలో 'మై స్టాంప్' ఆవిష్కరణ
బోయలపల్లిలో గొర్రెల మందపై చిరుత దాడి.. అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ హెచ్చరిక
కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ప్రతి ఓటరు తప్పనిసరిగా పాల్గొనాలి. - 
డబ్బు ఆశ చూపి చిన్నారులను తీసుకెళ్లేందుకు యత్నం.. పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు
27 రోజుల నిరాహార దీక్ష అనంతరం జంతర్ మంతర్‌కు సోనం వాంగ్‌చుక్ రాక
పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ అంతరాయం.. ఫోన్ ఫ్లాష్‌లైట్‌తో చికిత్స?