అందుకే తిరుమల వెళ్లడం ప్రారంభించా: జాన్వీ కపూర్  

అందుకే తిరుమల వెళ్లడం ప్రారంభించా: జాన్వీ కపూర్  

బాలీవుడ్ యంగ్ బ్యూటీ, శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్ తరచూ తిరుమల వెళ్తుంటుంది. తన సినిమా విడుదలకు ముందు, పుట్టినరోజు, ప్రత్యేక తేదీల్లోనూ ఆమె తిరుమల స్వామివారిని దర్శించుకుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో జాన్వీ మాట్లాడుతూ.. తిరుమలకు తరచూ వెళ్లడానికి గల కారణాన్ని వివరించింది.

బాలీవుడ్ యంగ్ బ్యూటీ, శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్ తరచూ తిరుమల వెళ్తుంటుంది. తన సినిమా విడుదలకు ముందు, పుట్టినరోజు, ప్రత్యేక తేదీల్లోనూ ఆమె తిరుమల స్వామివారిని దర్శించుకుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో జాన్వీ మాట్లాడుతూ.. తిరుమలకు తరచూ వెళ్లడానికి గల కారణాన్ని వివరించింది. తనతల్లి మరణించిన తర్వాత చాలా అలవాట్లను మార్చుకున్నట్లు జాన్వీ తెలిపింది.

‘అమ్మ కంటే నేనే ఎక్కువగా విశ్వసిస్తున్నా.. అమ్మ ఎప్పుడూ తిరుమల దేవుడి పేరును తలచుకుంటూ ఉండేది. షూటింగ్ గ్యాప్‌లో నారాయణ, నారాయణ అనుకుంటుండేది. ప్రతి ఏడాది పుట్టినరోజున స్వామివారిని దర్శించుకునేది. ఆమె చనిపోయిన తర్వాత తన పుట్టినరోజుకి నేను ఆ గుడికి వెళ్లాలని నిర్ణయించుకున్నా. అమ్మ లేకుండా మొదటిసారి తిరుమల వెళ్లినప్పుడు ఎంతో భావోద్వేగానికి గురయ్యా. అక్కడికి వెళ్లిన ప్రతిసారి ఏదో మానసిక ప్రశాంతత లభిస్తుంది. అందుకే తరచు వెళ్తుంటాను’ అని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది.

Related Posts