41 మద్యం సీసాల స్వాధీనం
On
విశ్వంభర, హైదరాబాద్: ఢిలీ, గోవా ప్రాంతాల నుంచి ఎన్డీపీఎల్ (నాన్ డ్యూటి పెయిడ్ లిక్కర్) విమానాల్లో తీసుక వస్తున్నారనే సమాచారం మేరకు ఎస్టీఎఫ్ డీ టీమ్ సీఐ నాగరాజు, సిబ్బంది కలిసి పహాడ్ షరీప్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో 41 మద్యం బాటిళ్లు ఢిల్లీ, గోవా ప్రాంతాల నుంచి తీసుక వచ్చిన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను మీర్పేట్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్లు సీఐ నాగరాజు తెలిపారు.



