భూమి వివాదం.. జనసేన నేతపై మహిళ తీవ్ర ఆరోపణలు

తనపై దాడి చేసి తాళిబొట్టు తెంపేశారని జనసేన నేతపై మహిళ ఫిర్యాదు

భూమి వివాదం.. జనసేన నేతపై మహిళ తీవ్ర ఆరోపణలు

  • భూమి వివాదంలో జనసేన నేతపై మహిళ తీవ్ర ఆరోపణలు.
  • జాకెట్ చించేసి, తాళిబొట్టు తెంపేశారని బాధితురాలి ఫిర్యాదు.
  • పొలం దారి విషయంలోనే వివాదం చోటుచేసుకున్నట్లు మహిళ వాదన.
  • పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని బాధితురాలి విజ్ఞప్తి.

Nelluru News: నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని అబ్బిపురం గ్రామంలో భూమి వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. స్థానికంగా జనసేన పార్టీకి చెందిన నాయకుడు వెంకట్రావుపై ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేయడం కలకలం రేపింది. తన భూమి విషయంలో జరిగిన వివాదంలో తనపై దాడి చేసి అవమానించారని బాధితురాలు అనసూయమ్మ ఆరోపించారు. బాధితురాలి కథనం ప్రకారం.. తన పొలం పక్కనే సుమారు 70 సెంట్ల భూమిని జనసేన నాయకుడు వెంకట్రావు కొనుగోలు చేశారని తెలిపారు. అనంతరం తమ భూమి మీదుగా దారి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారని, దీనిని తాము అడ్డుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుందని చెప్పారు.

ఆ సమయంలో వెంకట్రావు తనపై దౌర్జన్యానికి పాల్పడ్డారని అనసూయమ్మ ఆరోపించారు. జాకెట్‌లో చేయిపెట్టి లాగడంతో పాటు జాకెట్ చించేశారని, మెడలో ఉన్న తాళిబొట్టును తెంపేశారని, పొలంలోకి తోసివేసి దాడి చేశారని ఆమె వాపోయారు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధితురాలు పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని కోరినట్లు తెలిసింది. ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది. బాధితురాలి ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. అయితే ఈ ఆరోపణలపై జనసేన నాయకుడు వెంకట్రావు స్పందన ఇంకా వెలువడాల్సి ఉంది. పోలీసుల దర్యాప్తు అనంతరం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Read More తిరుపతి ఎస్పీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత: వైసీపీ నేతలపై కేసు

🕒 20 Jul 2026 ✍️ Desk

భూమి వివాదం.. జనసేన నేతపై మహిళ తీవ్ర ఆరోపణలు

తనపై దాడి చేసి తాళిబొట్టు తెంపేశారని జనసేన నేతపై మహిళ ఫిర్యాదు

Nelluru News: నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని అబ్బిపురం గ్రామంలో భూమి వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. స్థానికంగా జనసేన పార్టీకి చెందిన నాయకుడు వెంకట్రావుపై ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేయడం కలకలం రేపింది. తన భూమి విషయంలో జరిగిన వివాదంలో తనపై దాడి చేసి అవమానించారని బాధితురాలు అనసూయమ్మ ఆరోపించారు. బాధితురాలి కథనం ప్రకారం.. తన పొలం పక్కనే సుమారు 70 సెంట్ల భూమిని జనసేన నాయకుడు వెంకట్రావు కొనుగోలు చేశారని తెలిపారు. అనంతరం తమ భూమి మీదుగా దారి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారని, దీనిని తాము అడ్డుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుందని చెప్పారు.

ఆ సమయంలో వెంకట్రావు తనపై దౌర్జన్యానికి పాల్పడ్డారని అనసూయమ్మ ఆరోపించారు. జాకెట్‌లో చేయిపెట్టి లాగడంతో పాటు జాకెట్ చించేశారని, మెడలో ఉన్న తాళిబొట్టును తెంపేశారని, పొలంలోకి తోసివేసి దాడి చేశారని ఆమె వాపోయారు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధితురాలు పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని కోరినట్లు తెలిసింది. ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది. బాధితురాలి ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. అయితే ఈ ఆరోపణలపై జనసేన నాయకుడు వెంకట్రావు స్పందన ఇంకా వెలువడాల్సి ఉంది. పోలీసుల దర్యాప్తు అనంతరం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

🔗 https://www.vishvambhara.com/andhra-pradesh/woman-accuses-janasena-leader-of-land-dispute/article-18958