వెంకట్రామిరెడ్డిని డిస్ క్వాలిఫై చేయాలి : రఘునందన్ రావు

వెంకట్రామిరెడ్డిని డిస్ క్వాలిఫై చేయాలి : రఘునందన్ రావు


విశ్వంభర, వెబ్ డెస్క్ : మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని డిస్ క్వాలిఫై చేయాలని బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో ఓటర్ల ను మభ్య పెట్టడమే లక్ష్యంగా ఒక్కో ఓటర్ కు రూ. 500 చొప్పున డబ్బులు పంచారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీనిపై ఇప్పటీకే చాలా సార్లు పోలీసులకు కంప్లైంట్ చేశానని..ఎవరూ పట్టించుకోవడం లేదని కూడా పేర్కొన్నారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, మారో ఆరుగురు ఎమ్మెల్యేలు ఫామ్​ హౌజ్ నుంచి డబ్బులు పంపిణీ చేశారని చెప్పారు. తాను 20కి పైగా కార్లు ఉన్నాయని ఫిర్యాదు చేస్తే ఒక్క కారును పోలీసులు పట్టుకుని హడావిడి చేశారని తెలిపారు. ఇక్కడ న్యాయం జరగకపోతే ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని అన్నారు.

Read More ఘనంగా మున్నూరు కాపు మహిళ సంఘం బతుకమ్మ వేడుకలు