అమిత్ షాతో ఈటల భేటీ.. అధ్యక్షపదవి ఖాయమేనా..?
ఈటల రాజేందర్ పేరు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకంటే ఇప్పుడు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి, బండి సంజయ్ కు కేంద్రమంత్రి పదవులు దక్కాయి. దాంంతో ఇప్పుడు కిషన్ రెడ్డి పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు.
దాంతో ఇప్పుడు పార్టీ పగ్గాలు ఈటల రాజేందర్ కే ఇస్తారని జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. తాజాగా సోమవారం నాడు అమిత్ షాతో ఈటల ప్రత్యేకంగా భేటీ కావడం సంచలనం రేపుతోంది. అయితే పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఈటల రాజేందర్ స్పందించారు. ఆ విషయం తాను ఎలా చెప్పగలను అన్నారు.
పార్టీ అధిష్టానం ఆ విషయాన్ని నిర్ణయిస్తుందని తెలిపారు. ఆయన మాటలను బట్టి పార్టీ పగ్గాలు ఆయనకే ఇవ్వబోతున్నారని అర్థం అవుతోంది. తెలంగాణ నుంచి ఒక్క ఈటలతో మాత్రమే అమిత్ షా భేటీ అయ్యారు. అంటే కచ్చితంగా ఆయనకే పార్టీ పగ్గాలు అని.. రెండు, మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
అమిత్ షాతో ఈటల భేటీ.. అధ్యక్షపదవి ఖాయమేనా..?
ఈటల రాజేందర్ పేరు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకంటే ఇప్పుడు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి, బండి సంజయ్ కు కేంద్రమంత్రి పదవులు దక్కాయి. దాంంతో ఇప్పుడు కిషన్ రెడ్డి పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు.
దాంతో ఇప్పుడు పార్టీ పగ్గాలు ఈటల రాజేందర్ కే ఇస్తారని జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. తాజాగా సోమవారం నాడు అమిత్ షాతో ఈటల ప్రత్యేకంగా భేటీ కావడం సంచలనం రేపుతోంది. అయితే పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఈటల రాజేందర్ స్పందించారు. ఆ విషయం తాను ఎలా చెప్పగలను అన్నారు.
పార్టీ అధిష్టానం ఆ విషయాన్ని నిర్ణయిస్తుందని తెలిపారు. ఆయన మాటలను బట్టి పార్టీ పగ్గాలు ఆయనకే ఇవ్వబోతున్నారని అర్థం అవుతోంది. తెలంగాణ నుంచి ఒక్క ఈటలతో మాత్రమే అమిత్ షా భేటీ అయ్యారు. అంటే కచ్చితంగా ఆయనకే పార్టీ పగ్గాలు అని.. రెండు, మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


