అంబులెన్స్ ప్రారంభించిన హుస్సేన్ నాయక్
విశ్వంభర, మహబూబాబాద్: జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ చేతుల మీదుగా ఈసీఐ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల సహకారంతో మహబూబాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి అధునాతన సౌకర్యాలతో కూడిన ఐసీయూ అంబులెన్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జాటోతు హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ, అత్యవసర వైద్య సేవలను ప్రజలకు మరింత వేగంగా, నాణ్యంగా అందించడంలో ఈ అంబులెన్స్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ముఖ్యంగా గిరిజనులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో మెరుగైన వైద్య సేవలు పొందేందుకు ఈ అంబులెన్స్ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు
అంబులెన్స్ ప్రారంభించిన హుస్సేన్ నాయక్
విశ్వంభర, మహబూబాబాద్: జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ చేతుల మీదుగా ఈసీఐ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల సహకారంతో మహబూబాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి అధునాతన సౌకర్యాలతో కూడిన ఐసీయూ అంబులెన్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జాటోతు హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ, అత్యవసర వైద్య సేవలను ప్రజలకు మరింత వేగంగా, నాణ్యంగా అందించడంలో ఈ అంబులెన్స్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ముఖ్యంగా గిరిజనులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో మెరుగైన వైద్య సేవలు పొందేందుకు ఈ అంబులెన్స్ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు


