షాబాద్ లో ఆరోగ్య శిబిరం 

షాబాద్ లో ఆరోగ్య శిబిరం 

విశ్వంభర, షాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న కిశోర బాలికల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా వెల్‌స్పన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, నవజీవన్ ఆసుపత్రి సహకారంతో తాళ్లపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల, షాబాద్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ప్రత్యేక ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో ఆరు  నుంచి పదవ తరగతి వరకు చదువుతున్న బాలికలకు రక్త పరీక్ష, హీమోగ్లోబిన్ పరీక్ష, థైరాయిడ్ పరీక్షలు నిర్వహించారు. బాలికల ఆరోగ్య స్థితిపై వైద్యులు అవగాహన కల్పించడంతో పాటు అవసరమైన సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 110 మంది బాలికలు పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా    తాళ్లపల్లి గ్రామ సర్పంచ్  స్వాతి మాణిక్యం మాట్లాడుతూ, బాలికల ఆరోగ్యం కాపాడితేనే సమాజ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బాలికల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలోవెల్‌స్పన్ ఫౌండేషన్ కార్పొరేట్ సామాజిక బాధ్యత విభాగం అధిపతి కె. సురేఖ గారు, నవజీవన్ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ శ్రీ సుధీర్ చార్లెస్ గారు, తాళ్లపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కిరణ్మయి గారు, షాబాద్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ ప్రధానోపాధ్యాయురాలు కృష్ణ కుమారి, ప్రాజెక్టు నిర్వహణాధికారి భద్రయ్య, పవన్ కుమార్‌, నవజీవన్ ఆసుపత్రి సిబ్బంది, వెల్‌స్పన్ ఫౌండేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags: