ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వ వైద్యులు

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వ వైద్యులు

  • బాలుడు మృతికి కారణమైన వైద్యులను సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
  • చనిపోయిన బాలుడు కుటుంబానికి 10 లక్షల ఎక్స్ గ్రేసియా  చెల్లించాలి

విశ్వంభర, జనగాం జిల్లా : ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ బాలుడు మృతికి కారణమైన వైద్యులను సస్పెండ్ చేసి,వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చనిపోయిన బాలుని కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్యాల సోమన్న మండల కార్యదర్శి మాచర్ల సారయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  గురువారం పాలకుర్తి మండల కేంద్రంలో సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అర్చన కుటుంబాన్ని పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ హాస్పిటల్ ముందు బీఎస్పీ వారితొ కలిసి ధర్నా చేసి అనంతరం ప్రభుత్వ వైద్యాధికారి డిఎంహెచ్వో గారి దృష్టికి జరిగిన సంఘటన విషయాన్ని గతంలో జరిగిన సంఘటనలన్నీ కూడా వారికి వివరించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్పందించిన డిఎంహెచ్వో గారు మాట్లాడుతూ సంఘటనపై నలుగురితో కూడిన బృందం ఎంక్వైరీ చేసి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు అన్నారు. ఈ సందర్భంగా సోమన్న సారయ్య మాట్లాడుతూ
మంగళవారం మొదటి కాన్పు డెలివరీ కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన పాలకుర్తి మండలంలోని లక్ష్మీనారాయణ పురం గ్రామానికి చెందిన గర్భిణీ యాట అర్చన పురిటి నొప్పులతో బాధపడుతూ గత మూడు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరగా. వైద్యుల నిర్లక్ష్యంతో కడుపులోనే బాలుడు మృతి చెందారని విషయం చాలా బాధాకరమని వారన్నారు. గతంలో హాస్పిటల్లో ఇలాంటి సంఘటనలు జరిగాయని పాలకులు మారిన ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి ఘటనలు జరగడం వారి చేతకానితనానికి నిదర్శనం అన్నారు. గర్భిణీ వైద్యం పట్ల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు నిర్లక్ష్యం చేయడంతో జనగామలో గల ఎంసీఏ తరలించాలని  వారి కుటుంబ సభ్యులు కోరినప్పటికీ స్థానిక వైద్య సిబ్బంది స్పందించలేదని వారి కుటుంబ సభ్యులు తెలిపారు అన్నారు. పాలకుర్తి మండల కేంద్రంలో ఆసుపత్రికి ప్రజలు రావాలంటేనే జంకుతున్నారని ప్రజల్లో భయాందోళన పోవాలంటే బాలుని మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటానని మిగతా సిబ్బంది భయంతో వైద్యం అందిస్తారని అన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి సంఘటనలు పునర్వతం కాకుండా చూడాలని ఇలాంటి ఘటనలకు  కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని లేనియెడల సిపిఎం ఆధ్వర్యంలో అన్ని ప్రజాసంఘాలను ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు సోమసత్యం, మాసంపల్లి నాగయ్య, ఏదునూరి మదార్, బెల్లి సంపత్, భాష బోయిన కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags: