పాఠశాలలో స్టేజి నిర్మాణానికి శంకుస్థాపన
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, పల్లివాడ గ్రామ మాజీ సర్పంచ్ కంకణాల నరసింహారెడ్డి జ్ఞాపకార్థం అతని కుమారుడు కంకణాల రంజిత్ రెడ్డి గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో రూ.1.5 లక్షలతో స్టేజి నిర్మాణం కోసం ముందుకు రావడం మంచి విషయమని, విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలకు వేదిక ఉపయోగపడుతుందని, గ్రామ సర్పంచ్ కంభంపాటి శ్రీనివాసులు గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. బుధవారం స్టేజి నిర్మాణానికి గ్రామ సర్పంచ్ కంభంపాటి శ్రీనివాసులు గౌడ్ శంకుస్థాపన చేశారు. అనంతరం సర్పంచ్ కంభంపాటి శ్రీనివాసులు గౌడ్ మాట్లాడుతూ, కంకణాల రంజిత్ రెడ్డి తన తండ్రి జ్ఞాపకార్థం పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఒక చక్కని వేదిక నిర్మాణానికి ముందుకు రావడం చాలా అభినందనీయ విషయమని, గ్రామ అభివృద్ధితో పాటు విద్యాభివృద్ధి కోసం దాతలు ముందుకు రావాలని తెలిపినారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్.సుధారాణి, ఉపాధ్యాయులు రఘురామారెడ్డి, మేడి మధు, కాన్సిరాం, వెంకట్రాంరెడ్డి, జయశ్రీ, లలిత, నాయకులు ఒకటో వార్డ్ మెంబర్ దండిగ పాండు, మాజీ ఉప-సర్పంచ్ బెల్లి నరసింహ, దండిగ నాగరాజు, విజయ్, ఆరూరి లక్ష్మయ్య, దండిగ లక్ష్మయ్య, దండిగ ఉపేందర్, బెల్లి ఆది తదితరులు పాల్గొన్నారు.



