పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు  కావాలి

పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు  కావాలి

విశ్వంభర, చింతపల్లి:  తీదేడు గ్రామంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రామంలో మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు వివిధ రకాల మొక్కలను పంపిణీ చేశారు. అనంతరం హారితహారంలో భాగం పల్లె ధావఖాన వద్ద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, పచ్చదనం పెంపొందించేందుకు గ్రామ ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మొక్కల పెంపకంతో పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఇడబోయిన వెంకటయ్య యాదవ్, వార్డు సభ్యులు బొడ్డు పార్వతమ్మ యాదగిరి, మాదగోని కృష్ణ గౌడ్, దాసరి కళమ్మ ముత్తయ్య, రెడ్డి పద్మ పరమేష్, మర్ల యాదగిరి, గ్రామ ప్రజలు, అంగన్వాడీ టీచర్లు, ఆశావర్కర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

🕒 02 Aug 2026 ✍️ Desk

పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు  కావాలి

విశ్వంభర, చింతపల్లి:  తీదేడు గ్రామంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రామంలో మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు వివిధ రకాల మొక్కలను పంపిణీ చేశారు. అనంతరం హారితహారంలో భాగం పల్లె ధావఖాన వద్ద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, పచ్చదనం పెంపొందించేందుకు గ్రామ ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మొక్కల పెంపకంతో పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఇడబోయిన వెంకటయ్య యాదవ్, వార్డు సభ్యులు బొడ్డు పార్వతమ్మ యాదగిరి, మాదగోని కృష్ణ గౌడ్, దాసరి కళమ్మ ముత్తయ్య, రెడ్డి పద్మ పరమేష్, మర్ల యాదగిరి, గ్రామ ప్రజలు, అంగన్వాడీ టీచర్లు, ఆశావర్కర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

🔗 https://www.vishvambhara.com/telangana/everyone-should-be-a-partner-in-environmental-protection/article-20712

Tags: