రూ.12 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శ్రీకారం
- అభివృద్ధి పనులను ప్రారంభించిన కాంగ్రెస్ నేత కొలను హనుమంత్ రెడ్డి
విశ్వంభర, డి. పోచంపల్లి: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని డి. పోచంపల్లి డబుల్ బెడ్రూమ్ కాలనీలో సుమారు రూ.12 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కాంగ్రెస్ పార్టీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి కొలను హనుమంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహకారంతో కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలకు అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బి. శ్రీనివాస్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, రాము గౌడ్, సంజీవరెడ్డి, ధర్మారెడ్డి, అక్బర్, హర్ష గౌడ్, సురేష్, వీరేశ్, శ్రీనివాస్, వెంకట్ తదితరులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
రూ.12 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శ్రీకారం
విశ్వంభర, డి. పోచంపల్లి: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని డి. పోచంపల్లి డబుల్ బెడ్రూమ్ కాలనీలో సుమారు రూ.12 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కాంగ్రెస్ పార్టీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి కొలను హనుమంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహకారంతో కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలకు అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బి. శ్రీనివాస్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, రాము గౌడ్, సంజీవరెడ్డి, ధర్మారెడ్డి, అక్బర్, హర్ష గౌడ్, సురేష్, వీరేశ్, శ్రీనివాస్, వెంకట్ తదితరులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.


