ఇనుగుర్తిలో బిజెపి ఆవిర్భావ దినోత్సవం

ఇనుగుర్తిలో బిజెపి ఆవిర్భావ దినోత్సవం

విశ్వంభర, ఇనుగుర్తి: భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం మండల కేంద్రం ఇనుగుర్తి తో పాటు చిన్నముప్పారం లో సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఇనుగుర్తిలో ఆ పార్టీ మండల శాఖ అధ్యక్షులు దుంపల సందీప్ పార్టీ పతాకం ఆవిష్కరించగా,చిన్నముప్పారం లో పార్టీ సీనియర్ నేత కిసాన్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాలేరు నేతాజీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,  అగ్రనేతలైన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి, మాజీ హోం మంత్రి లాల్ కృష్ణ అద్వానీ ల నేతృత్వంలో పార్టీ పురుడు పోసుకుని అంచలంచలుగా ఎదిగి ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ గా రికార్డు సాధించిందన్నారు. ప్రధాని మోదీ భారతదేశాన్ని వరల్డ్ లో కీర్తించబడేలా పాలన చేస్తున్నారన్నారు.రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తిత్వం చేశారు. కార్యక్రమంలో కామినేని బాలరాజు, డా.వెంకటేశ్వర్లు, గోనే శ్రీనివాస్, ఘనపురం అశోక్, కదిరె అశోక్, కారుపోతుల అరుణ్, రాయలి రాము, అరుణ్, గుగులోతు సురేందర్ కవిత, వెంకన్న, రాజేందర్, సురేష్, విశ్వకర్మ,రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

Tags: