రామన్నపేటలో ఘనంగా బిజెపి ఆవిర్భావ దినోత్సవం   

రామన్నపేటలో ఘనంగా బిజెపి ఆవిర్భావ దినోత్సవం   

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలో బిజెపి 46వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి సీనియర్ నాయకులు, మాజీ ఎంపీటీసీ కన్నెకంటి వెంకటేశ్వరాచారి మాట్లాడుతూ, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వేసిన పునాదులపై నిర్మితమై, దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రవచించిన ఏకాత్మ మానవతావాదానికి కట్టుబడి పంక్తిలో చివరి వ్యక్తికి తొలి ప్రయోజనం చేకూరాలన్న అంత్యోదయ స్ఫూర్తితో "సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్" నినాదమే విధానంగా అటల్ జీ, అద్వానీ జీ తదితర అగ్రనేతల మార్గదర్శనంతో భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భరతమాత కీర్తి శిఖరాలను దిగంతాలకు వ్యాప్తి చేసే యజ్ఞంలో భాగమైన బిజెపి కార్యకర్తలకు, అభిమానులు, మద్దతుదారులకు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మడూరి ప్రభాకర్ రావు, కట్కూరి బిక్షపతి, కొమ్ము యాదయ్య, కూనూరు సుధాకర్, ఏలూరు రవి, యాదసు లక్ష్మణ్, గుండాల అంజయ్య, యాదాసు లక్ష్మణ్, కొడారి వెంకటేష్ యాదవ్, గుంటోజు కృష్ణమాచారి, అక్కినపల్లి సైదులు, నడిగోటి సైదులు, మందడి శ్రీధర్ రెడ్డి, శుభకోటి శశి కృష్ణమాచారి, కర్నాటి నరేష్, వడ్డేపల్లి అంబదాస్, దావునూరి గురిగి బీరప్ప, మోటే బీరప్ప, గొరిగే బాలకృష్ణ, అజయ్, కానుకుర్తి అంజయ్య, వడ్డేపల్లి అంబదాస్, ఏరువా సాయి, కట్కూరి అరవింద్, కన్నెగంటి వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు.

Tags: