కూరెల్ల - రాఘవపురం గ్రామల మధ్య, మూసీ ప్రవాహ వాగు పై, బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలి

విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 15 :- యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండలం కూరెళ్ళ గ్రామంలో సిపిఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా గ్రామ శాఖ ఆధ్వర్యంలో వాగును సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి మండల కార్యదర్శి వేముల భిక్షం మాట్లాడుతూ, నిత్యం రహీంఖాన్ పేట, నర్సాపురం మరియు రాఘవపురం గ్రామాల ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు ఈ మూసీ వాగు నుండి అనేక మంది తమ అవసరాల కోసం ప్రయాణించడం జరుగుతుంది. వర్షాకాలంలో వాగులోని నీళ్లు వంతెనపై నుండి పోవడం వలన ప్రజలు తమ రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి వంతెన నిర్మాణాన్ని చేపట్టాలని గత ప్రభుత్వంలో ఎంఎల్ఏ కు ,మరియు మంత్రికి పలు సందర్భాల్లో వినతి పత్రం ఇచ్చినప్పటికీ, అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ప్రయోజనం లేకుండా పోయిందని ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంఎల్ఏ మరియు ఎంపీ తక్షణమే స్పందించి ఈ వాగుపైన వంతెన నిర్మాణం చేపట్టాలని అలాగే రహీంఖన్ పేట నుండి నర్సాపురం వరకు డబల్ రోడ్ వేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేయడం జరిగింది. ప్రజా సమస్యలన్నింటిపై రాబోయే కాలంలో నిర్వహించే తహసీల్దార్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కార్యకర్తలను, ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మోత్కూరు మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు , గ్రామ శాఖ కార్యదర్శి తూమ్మలగూడెం యాదయ్య , సిపిఎం నాయకులు,బి రాములు,బి ఐలయ్య,రేసు యాది రెడ్డి, పొన్నం రాజామల్లు,ఎం సత్తయ్య,కే అంజయ్య,కే శంకరయ్య,ఎం భిక్షం,పొన్నం అండాలు,ఎడ్ల నర్సి రెడ్డి,ఎన్ ఉప్పలయ్య, బుర్ర రాకేష్, కొంపల్లి గంగయ్య, మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.



