బీపీ మండల్ సిఫారసులను అమలు చేయాలి
- యాదవ జేఏసీ చైర్మన్ డాక్టర్ దాసరి అజయ్
విశ్వంభర, బషీర్ బాగ్: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీపీ మండల్ సిఫారసులను అలు చేయాలని యాదవ జేఏసీ స్టేట్ చైర్మన్ డాక్టర్ దాసరి అజయ్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్ బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో యాదవ జేఏసీ ఆధ్వర్యంలో యాదవ రాజకీయ సదస్సును నిర్వహించారు. అనంతరం బీపీ మండల్ ( బిందేశ్వర ప్రసాద్ మండల్) 44వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్బంగా డాక్టర్ దాసరి అజయ్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీపీ మండల్ ఉద్యమం గ్రామ గ్రామాన చేపడతామన్నారు.ట్యాంక్ బండ్ మీద బీపీ మండల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలో బీపీ మండల్ ఉద్యమం ద్వారానే యాదవులు ముఖ్యమంత్రి అయ్యారన్నారు. తెలంగాణలో కూడా మరో మండల్ ఉద్యమం చేపడతామన్నారు.ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లను కల్పించిన ఘనత బీపీ మండల్ కే దక్కుతుందన్నారు.బీపీ మండల్ కు భారతరత్న అవార్డు ఇవ్వాలన్నారు.పార్లమెంట్ లో బీపీ మండల్ విగ్రహం ఏర్పాటు చేయాలన్నారు.70 కోట్ల ఓబీసీల ఆరాధ్య దైవం బీపీ మండల్ జయంతి,వర్ధంతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అధికారంగా నిర్వహించాలన్నారు.బీపీ మండల్ జీవిత చరిత్రను పాఠ్యాంశ పుస్తకాలలో చేర్చాలన్నారు.తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీ కులాలు,బహుజన కులాలను కలుపుకొని యాదవులు ముఖ్యమంత్రి కావాలన్నారు.ఈ కార్యక్రమంలో యాదవ జేఏసీ వైస్ చైర్మన్ చిలుకల శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధి రమేష్ యాదవ్,ప్రధాన కార్యదర్శి బీనవేని మల్లేష్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్లు మేకల శివశంకర్ యాదవ్,గంగుల మధు యాదవ్,ప్రధాన కార్యదర్శి బీనవేని మల్లేష్ యాదవ్,ఉపాధ్యక్షుడు దారమోనీ బక్కన్న యాదవ్, కార్యదర్శులు కడారి కాశీం,తోకల మహేష్ యాదవ్, గడ్డం శ్రీనివాస్ యాదవ్,యూత్ అధ్యక్షుడు నారమోని నరేష్ యాదవ్,మహిళా అధ్యక్షురాలు మంజుల వాణి యాదవ్,లీగల్ సెల్ అధ్యక్షుడు జుర్రు అరుణ్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.



