నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు
On
విశ్వంభర, హైదరాబాద్: రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ టీమ్, సరూర్నగర్ డీటీఎఫ్ టీమ్, అమన్గల్ ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది ఈఎస్ జీవన్ కిరణ్ అధ్వర్యంలో పల్లెచలుక తాండలో దాడలు నిర్వహించారు. 8 లీటర్ల నాటు సారాతోపాటు 580 లీటర్ల బెల్లం పానాకాన్ని నేలపాలు చేశారు. నాటు సారా తీయారీ సామాగ్రిని ధ్వంసం చేశారు. నాటు సారా తయారీకి పాల్పడుతున్న తొమ్మిది మందిపై కేసులు నమోదు చేశారు. ఐదుగురిని అరెస్టు చేశారు. ఇస్లావత్ హిరియా, కె. దకియా, జె.బిచా, హునియా, సలావత్ హుంగలను అరెస్టు చేశారు. మిగిలిన నలుగురు పరారీలో ఉన్నారు.



