మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ

మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ

విశ్వాంభర, పెద్ద శంకరంపేట: మలేరియా వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ  కార్యక్రమానికి జిల్లా మలేరియా అధికారిని డాక్టర్ నవ్య హాజరై మలేరియా వ్యాధి బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో  వైద్య సిబ్బందికి సూచించారు. ఈ ర్యాలీ  ఆరోగ్య కేంద్రం నుండి మొదలై గ్రామ పురవీధుల గుండా వెళుతూ మలేరియా నివారణకు చేపట్టాల్సిన  చర్యలపై వైద్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ఈఎంఓ డాక్టర్ వికాస్, ఎంపీహెచ్ఓ యాదయ్య, ఎంపీహెచ్ఎస్ వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.

Tags: