మొన్న ఐస్ క్రీమ్ లో వేలు.. ఇప్పుడు చాక్లెట్ సిరప్ లో ఎలుక..

మొన్న ఐస్ క్రీమ్ లో వేలు.. ఇప్పుడు చాక్లెట్ సిరప్ లో ఎలుక..



ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తున్న ఆహారాల్లో మొన్న వేలు కనిపించడం, ఇంకొకరికి తేలు కనిపించడంతో పాటు.. ఇప్పుడు మరో వ్యక్తికి ఏకంగా ఎలుక కనిపించింది. దాంతో అసలు ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తున్న ఆహారాల్లో ఏది మంచిది అనే చర్చ మొదలైంది. మొన్న ముంబైకి చెందిన వైద్యుడు ఐస్ క్రీమ్ ఆర్డర్ చేస్తే ఆయనకు అందులో తెగిపడిన మానవ వేలు కనిపించింది. 

Read More ఏఐ ఆవిష్కరణలకు తెలంగాణ వేదిక: మంత్రి శ్రీధర్ బాబు

అది నిజమే అని విచారణలో కూడా తేలింది. ఇక తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో శీఘ్ర ఇ-కామర్స్ కంపెనీ Zepto నుంచి ఆర్డర్ చేసిన హెర్షే కంపెనీకి సంబంధించిన చాక్లెట్ సిరప్‌లో చనిపోయిన ఎలుక రావడం సంచలనం రేపుతోంది. ఈ వీడియోలో సదరు మహిళ తాను ఆర్డర్ చేసిన చాక్లెట్ సిరప్ లో ఇలా వేలు కనిపించింది అంటూ వీడియో పోస్టు చేయడంతో అది కాస్తా సంచలనం రేపుతోంది.

ప్రమీ శ్రీధర్ అనే వ్యక్తి దాన్ని ఇన్ స్టాలో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్ అవుతోంది. తాము చాక్లెట్ లో ఎలుక చనిపోయి ఉందని గ్రహించే లోపే.. ఆ సిరప్ ను కుటుంబంలోని ముగ్గురు తిన్నారని వారు చెబుతున్నారు. అయితే అందులో ఇద్దరు బాగానే ఉన్నారని.. ఒకరు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆస్పత్రిలో జాయిన్ చేసినట్టు వారు చెప్పారు. ప్రస్తుతం ఆ బాధితురాలు కూడా బాగానే ఉన్నట్టు వారు వివరించారు. ఇక కంపెనీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని సదరు మహిళ ఆరోపిస్తోంది.

Related Posts